India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్యకర్తలు బుధవారం మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి B.P.Ed, D.P.Ed 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగుతాయన్నారు.
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య గజపతిరావు చౌదరి బుధవారం నియామకం అయ్యారు. ఈ మేరకు విజయనగరంలోని ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈమె ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని సంధ్య స్పష్టం చేశారు.
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.
సీతంపేట మండలం గడిగుజ్జి గ్రామానికి చెందిన గర్భిణి బిడ్డిక నిరోషాకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది గర్భిణిని వాహనంలో ఎక్కించి కొద్ది దూరం వచ్చేసరికి ఉమ్మ నీరు లీక్ అయ్యింది. గమనించిన ఈఎంటీ రామయ్య చాకచక్యంగా 108లోనే డెలివెరీ చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తదుపరి సపర్యల కోసం దోనుభాయి పీహెచ్సీకి తరలించారు.
టెక్కలి చేరివీధి సమీపంలో బుధవారం విద్యుత్ షాక్తో ఎన్డీఆర్ కాలనీకి బతకల పోతయ్య(58) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా ఉన్న ఒక గోడౌన్ మెడపైన పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ హై టెన్షన్ మెయిన్ లైన్కు తగిలి షాక్కు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటీన108లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య జయ, సంతోష్, ఇంద్రజ అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ జగదీశ్వరరావు మృతదేహాన్ని తన సొంత గ్రామమైన నందిగాం మండలం వల్లభరాయుడుపేటకు ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. టెక్కలి నుంచి వల్లభరాయుడిపేట వరకు అంతిమ యాత్ర నిర్వహించి తమ బంధువుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో వీర జవాన్కు తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొని సంతాపం తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన బోరోడ మధు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా ఇటీవల కుమార్తె వివాహం జరగడం, అతని పెద్దమ్మ మృతి చెందడం, ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రస్తుతానికి కుదరదని చెప్పడంతో ఆగ్రహానికి గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ DLTC, ITI లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
Sorry, no posts matched your criteria.