Srikakulam

News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకలు.. శ్రీకాకుళం ఎస్పీ సూచనలు

image

● బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ మద్యం పార్టీలు ఏర్పాటు చేయరాదు● మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ విధించిన నిర్ణీత సమయంలో మూసివేయాలి● మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు, సీజ్● అశ్లీల నృత్యాలకు చోటు లేదు. ● వేడుకల్లో మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు● బాణసంచా కాల్చడంపై ఆంక్షలు●  శుభాకాంక్షల పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే జైలు శిక్ష

News December 31, 2024

SKLM: ‘నూతన సంవత్సర వేడుకలకు ధర్మాన దూరం’

image

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంలేదని, ఎవరూ శుభాకాంక్షలు చెప్పడానికి తన నివాసానికి రావద్దని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో సంతాప దినాలు పాటిస్తున్నానని, ఇందులో భాగంగానే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడంలేదని, అభిమానులు, శ్రేయోభిలాషులకుతెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలన్నారు.

News December 30, 2024

SKLM: ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్ 

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లు భద్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి సోమవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో పరిస్థితి అంతా సాధరణంగానే ఉందని జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.

News December 30, 2024

కంచిలి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కంచిలి జాతీయ రహదారి పక్కన పబ్జీ దాబా సమీపంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మండలంలోని బాసు బంజీరికి చెందిన బొండాడ రామారావు (45) విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేకల ఆహారానికి దాబా సమీపంలోని పొలానికి వెళ్లారు. చెట్టు కొమ్మలు కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 30, 2024

సీతంపేట: వాటర్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

సీతంపేట మండలం జొనగ గ్రామానికి చెందిన ఎస్.రాజయ్య చిన్న కుమారుడు ఎస్.పవన్ కుమార్ (5) బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్‌లో పడి మరణించాడు. ఈ ఘటన  సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నీటి ట్యాంక్‌లో పడిన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News December 30, 2024

శ్రీకాకుళం: 2024లో మారిన రాజకీయ ముఖచిత్రం

image

2024లో సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళం రాజకీయ ముఖచిత్రం మార్చేశాయి. శ్రీకాకుళం MPతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలిచింది. అందులో జనసేన 1, BJP 1 స్థానం కైవసం చేసుకున్నాయి. ఎచ్చెర్ల ఎన్.ఈశ్వరరావు, పలాస గౌతు శీరిష, పాలకొండ నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం గొండు శంకర్, పాతపట్నం మామిడి గోవిందరావు మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి వరించడం విశేషం

News December 30, 2024

వజ్రపుకొత్తూరు: కుటుంబాన్ని కుదిపేసిన రోడ్డు ప్రమాదం

image

వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశిబుగ్గ పట్టణానికి చెందిన శివ(24) మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు కాశీబుగ్గ న్యూ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ డాక్టర్ వద్ద కార్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, అక్క భర్త (బావ) మృతి చెందగా.. తల్లిని, సోదరిని పోషిస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు.

News December 30, 2024

SKLM: దళారీల మాట నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

image

కానిస్టేబుల్ శారీరక దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడతాయని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. రిక్రూట్మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని చెప్పారు. అట్టి వివరాలు 6309990800, 6309990911 ఫోన్ నంబర్లకు తెలపాలని జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.

News December 29, 2024

SKLM: కానిస్టేబుల్ అభ్యర్థులు .. ఇవి తప్పనిసరి

image

రేపటి నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు తమతో పాటుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆటాచ్డ్ జిరాక్స్ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. కాల్ లెటర్ తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిసల్ట్), స్టేజ్-1 అప్లికేషన్, స్టేజ్-II అప్లికేషన్‌లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురాని వారి అభ్యర్థిత్వం తిరస్కరిస్తారు.

News December 29, 2024

ఆడంబరాలు వద్దు.. సేవా కార్యక్రమాలు చేద్దాం: ఎమ్మెల్యే శిరీష

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూలబొకేలు, మిఠాయిలు, శాలువలతో సత్కారాలు చేయవద్దని కోరారు. ఆ నగదును పేద విద్యార్థులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని ఆమె పేర్కొన్నారు.