Srikakulam

News July 16, 2024

సిక్కోలులో రూ.215 కోట్లు జరిమానా వేసి లాక్కున్నారు: సీఎం

image

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలపై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. జిల్లాలో ఎంఎస్‌సీ గ్రానైట్‌కు రూ. 215 కోట్లు జరిమానా వేశారని అన్నారు. చివరకు రైల్వేకోడూరు మాజీ MLA కి వంశధార గ్రానైట్ పేరిట సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారెవ్వరినీ వదిలేదిలేదని హెచ్చరించారు.

News July 16, 2024

ఉగ్రవాదుల దాడిలో శ్రీకాకుళం జవాన్ మృతి

image

ఉగ్రవాదులదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్ వీరమరణం పొందారు. నందిగం మండలం వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు(40) ఆర్మీలో పనిచేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పరిధిలోని అనంతనాగ ప్రాంతంలో నిన్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భార్య సమత దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. ఆయనకు మోక్షప్రియ, దీక్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA

image

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరించింది. 

News July 16, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

శ్రీకాకుళం: B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షలు టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed.(M.R) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. కావున B.Ed అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు చెప్పారు.

News July 15, 2024

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పలువురు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులను పరిచయం చేసుకొని, జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి, సహకరించాలని కోరారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ఈనెల 17న జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనెల 17న ఉదయం 9 గంటలకు సీనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు (పురుషులు, స్త్రీలు) ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News July 15, 2024

శ్రీకాకుళం: 18నుంచి కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం పోష్టర్‌ను ఆయన ఆవిష్కరణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయండి’

image

రాష్ట్ర ప్రభుత్వం ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం’ అమలు చేసి, తమ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని ‘శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు లక్ష నిర్మాణ కార్మిక కుటుంబాలు, సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు.