Srikakulam

News December 27, 2024

రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 27, 2024

SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.

News December 27, 2024

SKLM: మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించాలి

image

మానవ అక్రమ రవాణా ఎంతగానో వేధిస్తుంది దీని ద్వారా ఎంతోమంది అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వీధి బాలల భిక్షాటన, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులపై చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. 

News December 27, 2024

శ్రీకాకుళం: దోమల నివారణకు చర్యలు

image

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫాగింగ్ మిషన్లను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లాకు 50 ఫాగింగ్ మిషన్లు వచ్చాయని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా గ్రామాల్లో ఫాగింగ్ చేయించి దోమలను నివారిస్తామన్నారు.

News December 27, 2024

SKLM: ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలోఅధికారులు చర్యలు చేపట్టారు. 

News December 27, 2024

శ్రీకాకుళం: పాసింజర్ రైళ్లు రద్దు..తప్పని అవస్థలు

image

పలు పాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. రైళ్ల రద్దుతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్వీసులను నడపాలన్నారు.

News December 27, 2024

2024 సిక్కోలు రాజకీయ మధుర స్మృతులు

image

2024 సంత్సరం ముగింపు దశకు చేరింది. ఈ ఏడాది సిక్కోలు వాసులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మరెన్నో చెదు అనుభవాలను మిగిల్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మరింత ప్రాముఖ్యతను సంతరించకుంది. కూటమికి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ ఒక్క సీటు విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ అభిమానులు నైరాశ్యంలో కురికుపొయారు. రాజకీయ ఉద్ధండులు సైతం ఓటమి చవిచుశారు. మరికొందరు కొత్తవారు అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తారు.

News December 27, 2024

శ్రీకాకుళం: ‘మన్మోహన్ సింగ్‌‌తో అనుబంధం మరువలేనిది’

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్‌ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

News December 27, 2024

ఎచ్చెర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News December 27, 2024

శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.