India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సబ్ డివిజన్ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం జిల్లా, సర్వసభ్య సమావేశం పట్టణంలోని గూనపాలెంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గ ఎంపికలు ఎన్నికల అధికారి శివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన జిల్లా సంఘ అధ్యక్షురాలుగా ఎస్ వి ఎస్ఎల్ పూర్ణిమ, సెక్రటరీగా కె. జగన్ మోహన్ రావు , ట్రెజరర్ గా కె. మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అధికారులతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.. శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. 7390 అభ్యర్థుల్లో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళా పాల్గొంటారని పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ డైరెక్టర్ కె కవిత గురువారం తెలిపారు. సొంతంగా మూడు చక్రాల వాహనం కలిగిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను శ్రీకాకుళంలో తమ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలిపారు.
జిల్లా స్థాయి సమీక్షా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగింది. జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాలు మంజూరుపై చర్చించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవితో గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముచ్చటించారు. శంషాబాద్లో జరిగిన ఒక వేడుకలో(మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహం)లో చిరంజీవి, అచ్చెన్నాయుడు కలుసుకున్నారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ మేరకు చిరంజీవితో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు.
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ను జత చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.