Srikakulam

News December 25, 2024

‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ రివ్యూ

image

ఉత్తరాంధ్ర నేపథ్యంలో వెన్నెల కిశోర్ నటించిన ‘శ్రీకాకుళం షేర్లాక్‌హోమ్స్’ సినిమా నేడు రిలీజైంది. భీమిలి బీచ్‌లో హత్యకు గురైన ఓ మహిళ కేసు ప్రైవేట్ డిటెక్టివ్ హీరో వెన్నెల కిషోర్‌ చేతికి ఎలా వచ్చింది? ఆయన కేసును ఎలా చేధించారనేది కథాంశం. కాగా హీరో పాత్ర బలంగా లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు కొరవడటం సినిమాకు మైనస్. కొన్ని ట్విస్టెడ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. మూవీపై మీ కామెంట్.

News December 25, 2024

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శిశువు మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం వేకువజామున మగ శిశువు మృతిచెందాడు. నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీకి అడ్మిట్ అయ్యారు. బుధవారం వేకువజామున పురిటినొప్పులు అధికం కావడంతో సాధారణ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన శిశువు కొద్దిసేపటికి మృతిచెందింది. శిశువు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆసుపత్రిలో నిరసన తెలిపారు.

News December 25, 2024

SKLM: క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ  కెవి మహేశ్వర రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి క్రిస్మస్ పండగ జరుపుకోనున్న ప్రతి ఒక్కరుకి జిల్లా ఎస్పీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండగ వేళ ప్రతి ఒకరు జీవితంలో వెలుగులు రావాలని చెప్పారు. దేవుడు మీ పట్ల దయ చూపాలని పేర్కొన్నారు.

News December 24, 2024

శ్రీకాకుళం ఘోర ప్రమాదంలో మృతులు వీరే!

image

కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు <<14965595>>మృతి<<>> చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు కరెంట్ పోల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు(48), ఎం.లావణ్య(43), స్నేహగుప్తా(18) మరణించారు.

News December 24, 2024

శ్రీకాకుళం: విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీ సభ్యుడిగా వాబ యోగి

image

జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో భాగంగా సారవకోట మండలానికి చెందిన రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావును సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఎస్టీ కులం నుంచి తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.

News December 24, 2024

SKLM: నేటి నుంచి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీల సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈనెల 24  నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులని వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అలాగే  జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులని.. తిరిగి కళాశాలలు జనవరి 20న రీఓపెన్ చేయాలని ఆదేశించారు. 

News December 24, 2024

శ్రీకాకుళం: నేడు భారీ వర్ష సూచన

image

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వివరాలు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

News December 24, 2024

SKLM: కుష్ఠు వ్యాధిపై పోస్టర్ ఆవిష్కరణ

image

జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు కుష్ఠు వ్యాధిపై సర్వే చేస్తారని DM&HO డాక్టర్ బి.మీనాక్షి వివరించారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాది పై పోస్టర్‌ను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేకు వచ్చే ఆరోగ్య సిబ్బందికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. మీనాక్షి, ఇన్‌‌ఛార్జ్ డీఆర్ఓ అప్పారావు ఉన్నారు.

News December 23, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను యూనివర్సిటీ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రివెరిఫికేషన్ కోసం రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News December 23, 2024

శ్రీకాకుళం: రేపు దిశా కమిటీ సమావేశం

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ, మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. ఎంజి ఎన్ఆర్ఆఈజీఎస్, సంబంధించిన పథకాలు, మొదలగు వాటిపై ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు