India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు కుష్ఠు వ్యాధిపై సర్వే చేస్తారని DM&HO డాక్టర్ బి.మీనాక్షి వివరించారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాది పై పోస్టర్ను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేకు వచ్చే ఆరోగ్య సిబ్బందికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. మీనాక్షి, ఇన్ఛార్జ్ డీఆర్ఓ అప్పారావు ఉన్నారు.
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను యూనివర్సిటీ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రివెరిఫికేషన్ కోసం రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ, మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. ఎంజి ఎన్ఆర్ఆఈజీఎస్, సంబంధించిన పథకాలు, మొదలగు వాటిపై ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు
నరసన్నపేటలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సర్వీస్ రోడ్డులో పశుసంవర్ధక శాఖ అంబులెన్స్, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల కోసం అప్పటి వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు హయాంలో ఉషాకు ప్రతిపాదనలు పంపారు. ప్రధాన మంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్ కింద ఈ నిధులు మంజూరు చేశారు. వాటిని యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవన నిర్మాణాలు, ఉద్యోగ ఉపాధికి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్లోనే 6 దొంగతనాలు చేసిన నర్తు రాజేశ్(24)ను పోలీసులు <<14950516>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే. కవిటి(M) భైరిపురానికి చెందిన అతను ఖతర్కు వెళ్లాడు. తల్లికి బాగోలేకపోవడంతో జులై 20న తిరిగొచ్చాడు. ఆమె వైద్యానికి అప్పులు చేశాడు. అవి తీరకపోగా తల్లి సైతం చనిపోయారు. అప్పులు తీర్చడంతో పాటు సులభంగా డబ్బులు వస్తుండటంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. లేడీసే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నాడు.
అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెంలో ఆదివారం మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ఆదివారం భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుండగా డెకింగ్ కర్రలు విరిగిపోయాయి. క్షతగాత్రులను 108లో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీరు చిన్నారావు, లోపల్లి సోమేశ్వర రావు, ఒడిశాకు చెందిన కృష్ణా రావుకు తీవ్ర గాయాలయ్యాయి.
క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా సోమవారం కోడిరామూర్తి స్టేడియం పక్కన గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో హైటీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ పెద్దలు, జిల్లాలోని ఆయా సంఘాలకు సంబంధించి సంఘ కాపరులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన పాగోటి సతీష్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇటీవల డిసెంబర్ 20,21వ తేదీలలో వెస్ట్ బెంగాల్లోని న్యూ కోచ్ బెహర్లో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఈయన పాల్గొన్నారు. అండర్ 23 పోటీల్లో తన విజయం సాధించానని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కోచ్లు సోమేశ్, చిరంజీవిలు సతీష్ను అభినందించారు. ఈ క్రమంలో కోచ్లకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.
కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.