India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్లైన్లో సేల్స్ ఫోర్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబరులో సంప్రదించాలని, APSSDC అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
భద్రతా పనులు జరుగుతున్నందున విశాఖపట్నం, పలాస మధ్య ప్రయాణించే రైళ్ల గమ్యస్థానాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11,13 తేదీల్లో నం.07470 విశాఖపట్నం- పలాస ట్రైన్ శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుపుతామని, నం.07471 పలాస- విశాఖపట్నం ట్రైన్ను శ్రీకాకుళం రోడ్ నుంచి విశాఖపట్నంకు నడుపుతామన్నారు.
ఏపీలో గ్రామ సచివాలయాల వాలంటీర్లు వారి హక్కులను విస్మరించి బలవంతంగా రాజీనామాలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమదాలవలస మండలం న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు బుధవారం అన్నారు. ఈ మేరకు దిల్లీ ఎన్హెచ్ఆర్సిలో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.
ఉగండాలో ఈనెల 1వ తేదీన జరిగిన పారా బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన చాపర పూర్ణారావు అనే యువకుడు ప్రతిభ కనబరిచాడు. మిక్స్డ్ డబుల్స్లో బంగారం, మెన్ డబుల్స్లో వెండి, సింగిల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లు, నడుము విడిపోయినప్పటికీ ఆటలో తన ప్రతిభ కనబరిచిన పూర్ణను పలువురు అభినందించారు.
మత్స్యశాఖ అధికారులతో బుధవారం టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. విజయవాడలోని మత్స్యశాఖ కమీషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. మత్స్యకారుల జీవన విధానం, సమస్యలు, వేటనిషేధ భృతి, సంక్షేమ పథకాలు, మెరుగైన జీవనోపాధి, భద్రత తదితర ముఖ్య అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.
రాజం పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన రేగడి మండలంలో జరిగింది. మండలంలోని లచ్చరాయపురానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 8న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు రాజాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it
శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుంది. ఈ మేరకు ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీలోపు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 102 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 25వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది డిగ్రీ ఆరో సెమిస్టర్లో 9,832మంది విద్యార్థులు రిలీవ్ అయ్యారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.