Srikakulam

News December 23, 2024

నరసన్నపేటలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

image

నరసన్నపేటలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సర్వీస్ రోడ్డులో పశుసంవర్ధక శాఖ అంబులెన్స్, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News December 23, 2024

అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు

image

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల కోసం అప్పటి వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు హయాంలో ఉషాకు ప్రతిపాదనలు పంపారు. ప్రధాన మంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్ కింద ఈ నిధులు మంజూరు చేశారు. వాటిని యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవన నిర్మాణాలు, ఉద్యోగ ఉపాధికి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

News December 23, 2024

శ్రీకాకుళం: తల్లి కోసం దొంగతనాలు చేసి..!

image

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్‌లోనే 6 దొంగతనాలు చేసిన నర్తు రాజేశ్(24)ను పోలీసులు <<14950516>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే. కవిటి(M) భైరిపురానికి చెందిన అతను ఖతర్‌కు వెళ్లాడు. తల్లికి బాగోలేకపోవడంతో జులై 20న తిరిగొచ్చాడు. ఆమె వైద్యానికి అప్పులు చేశాడు. అవి తీరకపోగా తల్లి సైతం చనిపోయారు. అప్పులు తీర్చడంతో పాటు సులభంగా డబ్బులు వస్తుండటంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. లేడీసే టార్గెట్‌గా దొంగతనాలు చేస్తున్నాడు.

News December 23, 2024

అనకాపల్లిలో శ్రీకాకుళం వ్యక్తులకు గాయాలు

image

అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెంలో ఆదివారం మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ఆదివారం భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుండగా డెకింగ్ కర్రలు విరిగిపోయాయి. క్షతగాత్రులను 108లో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీరు చిన్నారావు, లోపల్లి సోమేశ్వర రావు, ఒడిశాకు చెందిన కృష్ణా రావుకు తీవ్ర గాయాలయ్యాయి.

News December 23, 2024

SKLM: నేడు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం

image

క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా సోమవారం కోడిరామూర్తి స్టేడియం పక్కన గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో హైటీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ పెద్దలు, జిల్లాలోని ఆయా సంఘాలకు సంబంధించి సంఘ కాపరులు హాజరై విజయవంతం చేయాలన్నారు.

News December 22, 2024

బాడీ బిల్డింగ్ పోటీల్లో కంబకాయ వాసికి గోల్డ్ మెడల్

image

బాడీ బిల్డింగ్ పోటీల్లో నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన పాగోటి సతీష్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇటీవల డిసెంబర్ 20,21వ తేదీలలో వెస్ట్ బెంగాల్‌లోని న్యూ కోచ్ బెహర్‌లో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఈయన పాల్గొన్నారు. అండర్ 23 పోటీల్లో తన విజయం సాధించానని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కోచ్‌లు సోమేశ్, చిరంజీవిలు సతీష్‌ను అభినందించారు. ఈ క్రమంలో కోచ్‌లకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.

News December 22, 2024

SKLM: చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

image

కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

News December 22, 2024

కత్తులతో బెదిరించి చోరీకి యత్నం

image

శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్ వద్ద కాకి వీధిలోని గోవింద్ ఇంటిలో శనివారం రాత్రి దొంగలు కత్తులతో హల్చల్ చేశారు. ఇంట్లోని బాలుడు, ఓ మహిళ కూరగాయల కత్తితో  ప్రతిఘటించారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇంటి సభ్యుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. DSP వివేకానంద, సీఐ పైడిపు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 22, 2024

హరిపురం: రైలు పట్టాలపై ..మహిళ మృతదేహం

image

మందస మండలం హరిపురం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైందని కాశీబుగ్గ జీఆర్పీ ఎస్‌ఐ ఎస్‌కె షరీఫ్ తెలిపారు. మృతురాలి వయస్సు 55 ఉంటుందని, బిస్కెట్ కలర్ జాకెట్, చింత పిక్క రంగు చీర కట్టుకుని ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News December 22, 2024

శ్రీకాకుళం: ఎన్నికల క్లయిమ్స్‌పై సూపర్ చెక్ 

image

ఎన్నికల క్లెయిమ్స్‌పై సూపర్ చెక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నిర్వహించారు. గడిచిన ఎన్నికలలో ఫారం 6, 7, 8 క్లెయిమ్స్‌కు సంబంధించి డిస్పోజ్ అయి క్లయిమ్స్‌లలో భారత ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన 23 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వయంగా సూపర్ చెక్ చేశారు. ఆయా క్లెయిమ్స్ కింద అర్జీ పెట్టుకున్న వారి ఇంటి వద్దకు బిఎల్ఓలు వెళ్లారా? లేదా? అడిగి తెలుసుకున్నారు.