Srikakulam

News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 21, 2024

శ్రీకాకుళం: అంగన్వాడీలకు సెలవు

image

వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగనవాడీలకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అంగన్వాడీ సిబ్బంది ముందస్తుగా చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో టీచర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఇబ్బందిగా ఉన్న చోట ఎంఈవోలు సెలవులు ప్రకటించాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు.

News December 21, 2024

సిక్కోలు విద్యార్థికి బొంబై ఐఐటీలో అవార్డు

image

బొంబై ఐఐటీలో మార్కెట్ బజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ & టెక్నాలజీ ప్రదర్శనలో సిక్కోలు జిల్లా సోంపేట పట్టణానికి చెందిన మరిడీ ఆదర్శ్ కుమార్ 3 వ స్థానంలో అవార్డు సొంతం చేసుకున్నారు. సముద్ర మార్గాల ద్వారా పయనించే పెద్ద ఓడలు దిగువన, వివిధ మైక్రో ఆర్గాన్స్ అతుక్కోవడంతో వాటి వల్ల సముద్ర తీరం కలుషితం అవుతుందని వాటిని క్లీన్ చేసేందుకు కొత్త పరికరం తాలూకా ప్రదర్శన చేశానని విద్యార్థి తెలిపారు.

News December 20, 2024

శ్రీకాకుళం: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97055 22122కు వాట్సాప్ చేయండి.

News December 20, 2024

పలాస: చెట్టుకు ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News December 20, 2024

నేడు విచారణకు హాజరుకానున్న దువ్వాడ

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టెక్కలి పీఎస్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై తాజాగా టెక్కలి పోలీసులు దువ్వాడ కు 41-ఏ నోటీసులు జారీచేశారు. దీనిపై శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 20, 2024

విశాఖలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

image

విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఎంటెక్ చదువుతున్న వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు శిరీష(23) విశాఖలో తన అక్క, బావ దగ్గర ఉంటుంది. తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆమెకు చదువు మధ్యలో పెళ్లి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శిరీష భర్త శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 20, 2024

కవిటి: చైన్ స్నాచింగ్ నిందితుడి గుర్తింపు

image

శ్రీకాకుళం జిల్లా కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో రెండు రోజుల క్రితం మహిళ మెడలో బంగారం గొలుసులు దొంగతనం చేసిన విషయం విదితమే. కాగా గురువారం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేసే క్రమంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిపై కూడా దాడి చేసిన ఘటన సిక్కోలులో కలకలం రేపింది. దుండగులు మహిళను మాటల్లో పెట్టి ఈ చోరీకి పాల్పడ్డాడు.

News December 20, 2024

SKLM: మందగించిన ధాన్యం కొనుగోలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 3,59,495 ఎకరాల్లో వరి పంట సాగైంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 4.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జిల్లావ్యాప్తంగా 403 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 2.15 మెట్రిక్‌ టన్నులను సేకరించారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షం ప్రభావంతో ధాన్యం కొనుగోలు మందగించినట్లు తెలుస్తోంది.

News December 19, 2024

SKLM: రథ సప్తమిని రాష్ట్ర పండుగ‌గా గుర్తింపు

image

ఆరోగ్య ప్ర‌దాత‌, ప్ర‌త్య‌క్ష దైవం అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణస్వామి వారి ర‌థ‌స‌ప్తమి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుద‌ల చేసింది. ఈ మేర‌కు MLA గొండు శంక‌ర్ విశాఖ-ఎ కాల‌నీలోని త‌న కార్యాల‌యం నుంచి గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌తీ ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో సూర్య‌దేవుని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌థ‌స‌ప్తమి వేడుక‌లు నిర్వహిస్తుంటామని తెలిపారు.