India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రప్రభుత్వ నిర్వహణలోని శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో భాగంగా, సిక్కు సంప్రదాయ గురువుల గురించిన పది భాగాల ధారావాహికను విశాఖ ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శ్రీకాకుళం రచయిత జంధ్యాల శరత్ బాబు ప్రసంగాల పరంపరను రికార్డు చేసింది. ఆ ధార్మిక ఉపన్యాసాలు వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో మొదలై, ప్రతీ వారం రెండున్నర నెలలపాటు ఉంటాయని ఏఐఆర్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తరాంధ్ర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రలో గురువారం పర్యటించనున్న ముఖ్యమంత్రి ఆ రోజు భోగాపురం విచ్చేయునున్నారు. మధ్యాహ్నం12.35గంటలకు విమానాశ్రయం నిర్మాణ ప్రదేశానికి చేరుకుంటారన్నారు. సుమారు గంట పాటు ఇక్కడ జరుగుతున్న పనులపై అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు, ఎల్&టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం 1.35 గంటలకు విశాఖ బయలుదేరుతారని తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులు సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లుచేస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా సమీపంలో రన్నింగ్ విశాఖ ఎక్స్ప్రెస్లో యువతి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాష్ రూమ్కి వెళ్లిన యువతిపై మద్యం మత్తులో లైంగిక దాడికి యత్నించాడు. దీంతో పెనుగులాటలో ట్రైన్ నుంచి ఇద్దరు జారిపడినట్లు బాధితురాలు తెలపారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిది జములూరు మండలం. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
✒ నాగావళి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కలెక్టర్ ప్రణాళికలు
✒ కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మృతి
✒ దళితులకు భూహక్కు పత్రాలు అందజేయాలి
✒ మందస మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
✒ కోడి రామ్మూర్తి స్టేడియం పునః నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం
✒ హిరమండలంలో వలకు చిక్కిన కొండచిలువ
✒ మందసలో 1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
✒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై రామ్మోహన్ సమీక్ష
శ్రీకాకుళం నగరంలోని మొండేటివీధిలో శ్రీలలిత సహిత శివకామేశ్వర స్వామి ఆలయంలో షిర్డీసాయిబాబా మందిరంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారు భక్తులకు శ్రీకూర్మావతారంలో దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల్లో నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది (రివర్ ఫ్రంట్) అభివృద్ధికి, సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగావళి నదీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలని అన్నారు.
నరసన్నపేట కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడు పొట్నూరు జగన్ మోహన్ రావు మంగళవారం అకాల మరణం చెందారు. ఈ మేరకు సంఘం సభ్యులు జగన్మోహన్ రావు మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. కళింగ వైశ్య సంఘం అభివృద్ధికి, సభ్యుల మధ్య సమన్వయానికి జగన్మోహన్ రావు కృషి చేశారని వారు గుర్తు చేశారు. జాతికి చేసిన మేలును మరవలేమని కొనియాడారు. జగన్మోహన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రాయి గేటు అండర్ పాస్ కింద గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద చంద్రగిరి సామాజిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందినట్లు మందుల చీటీ ఉంది. సంబంధిత వ్యక్తి యాచకుడిగా తెలుస్తోంది. మందస పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పూరీ జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ఈనెల 15, 16, 17వ తేదీల్లో టెక్కలి మండలం నౌపడ రైల్వే స్టేషన్ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు సోమవారం తెలిపారు. 15, 16వ తేదీల్లో ఉదయం 4 గంటలకు నౌపడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.05 నిమిషాలకు పూరీ చేరుకుంటుందన్నారు. తిరిగి 15, 17వ తేదీల్లో రాత్రి 11 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఉదయం 6.40 గంటలకు నౌపడ చేరుకుంటుంది.
Sorry, no posts matched your criteria.