Srikakulam

News December 19, 2024

SKLM: ఈ నెల 20న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల 20వ తేదీన శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ డైరెక్టర్ కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.

News December 19, 2024

SKLM: అక్రమ సంబంధమే హత్యకు కారణం

image

ఆమదాలవలసలో గాజులకొల్లివలస RR కాలనీకి చెందిన దామోదర పద్మ(35)  ఆదివారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు బుధవారం సాయంత్రం ఆమదాలవలస సీఐ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద మీడియా సమావేశంలో తెలిపారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

News December 19, 2024

రాజాంలో నేడు నీటి సరఫరా బంద్

image

రాజాం పరిధిలోని పాలకొండ రోడ్డులో పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొనుగుట్టువలస, అంబేద్కర్ కాలనీ, విద్యానగర్, వరలక్ష్మి నగర్, మారుతి నగర్ ప్రాంతాలలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

News December 18, 2024

SKLM: రూ.15 లక్షలు వేరే అకౌంట్లోకి.. తిరిగి అందించిన పోస్టల్ సిబ్బంది

image

అరసవిల్లికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న సుమారు రూ.15 లక్షలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారు. అయితే ఆ నగదు సాంకేతిక లోపంవల్ల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యాయి. కాగా పోస్టల్ సిబ్బంది అంబుడ్సమన్ ద్వారా ఆ నగదును తిరిగి కస్టమర్‌ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేశారు. దీంతో పోస్ట్ మాస్టర్‌ రంగారావుకి కస్టమర్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

News December 18, 2024

హ్యాపీ బర్త్ డే రామ్మోహన్ నాయుడు

image

రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు. బుల్లెట్ లాంటి మాటలు, సబ్జెక్ట్‌పై పట్టు, క్రమ శిక్షణతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 26ఏళ్లకే పార్లమెంట్‌కు ఎన్నికై అనతి కాలంలోనే తన మార్క్ చూపించారు. పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మంది ప్రశంసలు పొందారు. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. చిన్న వయసులో ఆ పదవి పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

News December 18, 2024

కోటబొమ్మాలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోటబొమ్మాలి నుంచి టెక్కలి వైపు స్కూటీపై మహిళ వెళ్తుండగా పాకివలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, పక్క రోడ్డులో వెళ్తున్న మహిళను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

News December 18, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి 23 వరకు నిర్వహించనున్న డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్‌ఛార్జ్ DRO అప్పారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 1831 మంది అర్హత పొంది ఉన్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాల, వెంకటేశ్వర ఇంజినీరింగ్, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News December 18, 2024

అల్పపీడన ప్రభావం.. సిక్కోలుకు భారీ వర్షసూచన

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలితీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో అలజడి మొదలవగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News December 18, 2024

SKLM: రైతులు అప్రమత్తంగా ఉండాలి:జేసీ

image

నేటి నుంచి నాలుగు రోజుల వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షంతో ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రతి మండలంలో 100 టార్పాలిన్లు మండల తహసీల్దార్ స్వాధీనంలో ఉంచామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.

News December 17, 2024

శ్రీకాకుళం: పోలీసులపై దాడి.. నిందితుల అరెస్టు

image

శ్రీకాకుళం జిల్లా పోలీసులపై ఈ నెల 12వ తేదీ రాత్రి రాజమండ్రిలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి ఒక కేసులో ముద్దాయి రాపాక ప్రభాకర్(ప్రతాప్ రెడ్డి)ని తీసుకువెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై దాడికి పాల్పడిన భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మందిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు.