Srikakulam

News July 7, 2024

పలాస: మేకపోతు దొంగను పట్టుకుని చిత్తకొట్టారు

image

పలాస మండలం లొద్దభద్రలో శనివారం సాయంత్రం మేకపోతును దొంగలించి తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కేశవరావు అనే గొర్రెల కాపరికి చెందిన మేకపోతును ముగ్గురు యువకులు కాళ్లు కట్టేసి తరలిస్తుండగా స్థానికులు చూశారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై పరారవ్వగా ఓ యువకుడు స్థానికులకు చిక్కాడు. అతడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.

News July 7, 2024

రాజాం: మంట పుట్టిస్తున్న మిర్చీ ధరలు

image

రాజాం కూరగాయల మార్కెట్లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు చేరింది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి మిరప పంటలు పాడైపోవడంతో దిగుమతి తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులకు మిరప మరింత ఘాటెక్కింది. ఇదిలా ఉండగా మిరప సాగు చేసే రైతులు నష్టాల్లో చిక్కుకుని అప్పుల పాలవతున్నామని వాపోయారు.

News July 7, 2024

శ్రీకాకుళం: ‘YSR జయంతిని వేడుకగా జరపాలి’

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం, స్కూల్లో పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.

News July 6, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

image

*అక్రమ ఇసుక తవ్వకాలపై పిర్యాదు చేయండి: కలెక్టర్
* కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తత: ఎస్పీ
* టెక్కలిలో 9న ఫార్మా ఉద్యోగుల జాబ్ మేళ
* B. Ed సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల : డీన్
* హెల్మెట్ లేని ప్రయాణం.. రూ .1000 జరిమానా
* ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి: జేసీ
* ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ

News July 6, 2024

శ్రీకాకుళం: ఒక్కొక్కరిగా ఆస్పత్రిపాలవుతున్న విద్యార్థులు

image

కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గత 2రోజులుగా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి వరకు పాఠశాలలో చదువుతున్న 20మంది విద్యార్థులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

శ్రీకాకుళం: ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ

image

శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉచిత ఇసుక నూతన పాలసీ విధానం ఈనెల 8 నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. భూగర్భ గనుల శాఖకు సంబంధించి నూతన ఇసుక విధానంపై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు, ఎస్పీలకు, భూగర్భ గనుల శాఖ అధికారులకు వివరించారు.

News July 6, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో కలెక్టర్ భేటీ

image

శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాతో నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో ఆయనని కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గురించి ఇరువురు చర్చించారు.

News July 6, 2024

పాతపట్నం: మిగులు సీట్ల భర్తీకి ఆహ్వానం

image

పాతపట్నం డా.బీ.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్లు 9వ తేదీన భర్తీ చేయునట్లు ప్రిన్సిపల్ వీ.అర్చన తెలిపారు. 5వ తరగతికి సంబంధించిన సీట్లను లాటరీ రూపంలో కేటాయించబోతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్‌కు మార్కుల ఆధారంగా, మొదటిగా పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. వివరాలకోసం పాఠశాలను సంప్రదించాలని కోరారు.

News July 6, 2024

శ్రీకాకుళం: ‘వైయస్ఆర్ జయంతిని వేడుకగా నిర్వహించాలి’

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం, స్కూల్లో పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైకాపా కుటుంబ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.

News July 6, 2024

శ్రీకాకుళం: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

శ్రీకాకుళం జిల్లాలో గుర్తింపు కార్డులు లేని హిజ్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఐడీ కార్డు, వైద్య ధ్రువపత్రాలను అందిస్తామని వయోవృద్ధుల సహాయ సంచాలకురాలు కవిత శనివారం తెలిపారు. గుర్తింపు కార్డులు లేని హిజ్రాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ పథకాలకు ఈ గుర్తింపు కార్డు చాలా అవసరమని ఆమె తెలిపారు.