India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
పవన్ కళ్యాణ్ని తమ రాజకీయ లబ్ధికోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కలెక్టరుకు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను కలిసి లేఖను అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ వంతెనలను ప్రతిపాదించి సాంకేతిక అనుమతులు, పరిపాలన, ఆర్థిక అనుమతుల మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచామని ఆ పనులను ప్రారంభించాలని అభ్యర్థించారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అటుగా భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యిరాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్ చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.