India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన డ్రైవర్ ఢిల్లీ రావు(38) హైదరాబాద్లో నురగలు కక్కుకుని మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో హైదరాబాదులోని జవహర్నగర్కు చేరుకున్నారు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని క్లీనర్ తెలిపాడు. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
సైబర్ నేరగాళ్లు చేసే కొరియర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక సూచించారు. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాను పోలీస్ అధికారినని మీ పేరు మీద వచ్చిన కొరియర్లో అక్రమ ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు ఉన్నాయని, దాని కారణంగా మీ మీద FIR నమోదు చేశామని చెప్పి, మోసం చేస్తున్నారని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
కంచిలి మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్రకు ఉత్సవ విగ్రహాలను శనివారం రోజున సిద్ధం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు మేళ తాళాలు, గోష్ఠితో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల జగన్నాథ యాత్ర నిర్వహించనున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నంబర్లు విడుదల చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే 1800 4256012,08942 293229,97016 91657 నంబర్లకి mgoskimsandcomplaints@myyahoo.com ద్వారా కూడా సమాచారమివ్వాలని కోరారు.
PHCలో ప్రసవాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల సాధారణ ప్రసవాలు అవుతున్నా రిఫరల్ కేసులుగా మార్చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మూడు నెలలకుగాను 960 ప్రసవాలు చేయాలని అధికారులు లక్ష్యం ఇవ్వగా.. కేవలం 184 ప్రసవాలు మాత్రమే చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం అవుతోంది. ఏప్రిల్లో 48, మే 54, జూన్ 82 ప్రసవాలు చేశారు. ఆరు కేంద్రాలో ఒక్కటి నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జిల్లావ్యాప్తంగా జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాల నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురం, ఇల్లిసిపురంలో పూరి సాంప్రదాయంలో 9 రోజులు, గుజరాతీపేటలో ఆంధ్ర సాంప్రదాయంలో 11 రోజులు వేడుకలు చేస్తారు. ఆదివారం జరిగే రథయాత్రకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాజాం పట్టణానికి చెందిన వెంకటేష్, లక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒకటే అయినప్పటికీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూన్ 5న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని రాజాం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.
తన మొదటి నెల జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తన జీతం చెక్కుని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి అందజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎంతో అవసరమని ఎంపీ కలిశెట్టి అభిప్రాయపడ్డారు.
* వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: కలెక్టర్ స్వప్నిల్ * 8 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు దరఖాస్తులు : మన్యం జిల్లా ఉపాధి అధికారి * అధికారులు అంకితభావంతో పనిచేయాలి: కలెక్టర్ * ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను పూర్తి చేసేందుకు చర్యలు: కలెక్టర్ * MSc పరీక్షల టైం టేబుల్ విడుదల * కోటబొమ్మాళి: విద్యుత్ షాక్తో లారీ క్లీనర్ మృతి *శ్రీకాకుళం: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష
శ్రీకాకుళం జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టింది. ఆధునీకరణ, మరమ్మతులకు రూ.78.85 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలైన మదనగోపాలసాగరం(రూ.31.20 లక్షలు), చిన్నసాన(రూ.14.60 లక్షలు), సౌడాం(రూ.13.80 లక్షలు), సుభద్రాపురం(రూ.4.40 లక్షలు), టెక్కలిపాడు(రూ.6.50 లక్షలు), తొగిరి (రూ.8.35 లక్షలు) ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Sorry, no posts matched your criteria.