Srikakulam

News December 12, 2024

శ్రీకాకుళం: IIITలో చనిపోయింది ఎవరంటే..?

image

శ్రీకాకుళం జిల్లా ఎస్ఎంపురం IIIT క్యాంపస్‌లో ఓ విద్యార్థి చనిపోయిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు(M) పీఆర్సీ తండాకు చెందిన రమావత్ నాయక్, విజయబాయి కుమారుడు ప్రవీణ్ నాయక్(18) సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

News December 12, 2024

ఆ విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు: ధర్మాన

image

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్, TDP, బీజేపీ ఏకమైనా గత ఎన్నికల్లో మాకు(YCP) 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి ఇచ్చిన హామీలు నమ్మి పేదలు అత్యాశకు పోయి తప్పు చేశారు. మేము కార్యకర్తలను విస్మరించిన మాట కొంత వరకు నిజమే. ఇదే విషయాన్ని జగన్‌ కూడా అంగీకరించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ ముందుకెళ్తాం’ అని నిన్న టెక్కలిలో జరిగిన వైసీపీ ఆఫీస్ ప్రారంభ వేడుకల్లో వ్యాఖ్యానించారు.

News December 12, 2024

SKLM: చంద్రబాబు కృషి ఎంతో ఉంది: మంత్రి

image

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో 5వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

News December 11, 2024

SKLM: రోడ్డు పనులు వేగవంతం చేయాలి- రామ్మోహన్

image

పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ రహదారులకు సంబంధించి నౌపడ నుంచి బెండిగేట్ రహదారిని రెండు వరుసల రహదారిగా చేయాలని కోరుతూ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసన్నపేట-ఇచ్ఛాపురం వరకు ఉన్న జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.

News December 11, 2024

శ్రీకాకుళం జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు..?

image

శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన పేరు పెట్టాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజాకవి, ఫ్రీడం ఫైటర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సిక్కోలుకు గరిమెళ్ల పేరు పెట్టాలని అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మరావు కోరారు. మరి ఎవరి పేరు అయితే జిల్లాకు పెట్టాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 11, 2024

మందస: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

image

క్షణికావేశంలో ఓ యువకుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మందసకు చెందిన బెహరా రామకృష్ణ(33) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఇటుకలు బట్టికి వెళ్లి పూరిపాకలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి బెహరా శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

News December 11, 2024

శ్రీకాకుళం: ఓబీసీ ప్రక్రియను వేగవంతం చేయాలి

image

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్‌లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పలు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఆయనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.

News December 10, 2024

రణస్థలం: రెండు బైకులు ఢీ వ్యక్తి మృతి

image

రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్‌పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్‌పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

News December 10, 2024

దువ్వాడ శ్రీనివాస్‌పై ఒంగోలు PSలో ఫిర్యాదు

image

పవన్ కళ్యాణ్‌ని తమ రాజకీయ లబ్ధికోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News December 10, 2024

మందస వద్ద పులి అడుగు జాడలు

image

పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.