India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం డా.బి.ఆర్.ఏ.యూ.లోని PG ఆర్ట్స్ & సైన్స్ కోర్సులకు సంబంధించి 3వ సెమిస్టర్ పరీక్షలు రీ షెడ్యూల్ చేశారు. తొలుత పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రకటించగా మళ్లీ డిసెంబర్ 16వ తేదీకి మార్పులు చేశారు. విద్యార్థుల కోరిక మేరకు పరీక్షల తేదీని రీ షెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనలో భాగంగా టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహనాలను అపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
సంతబొమ్మాలి మండలం రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో లక్షాలది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాలు అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇందుకోసం కర్మవీర చక్ర అవార్డును ఢిల్లీలో నవంబర్ 26న హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్సెస్ ప్రాన్క్రోసి స్టూడిజా చేతులు మీదుగా ప్రధానం చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు.
శ్రీకాకుళం జిల్లా వాసులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉండే పెన్షన్ దారులకు ఈనెల 30వ తేదీనే పెన్షన్ అందజేయనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే 3.14 లక్షల మంది పెన్షన్ దారులు ఉండగా వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయాలని నిర్ణయించింది.
శ్రీకాకుళంలోని చలి విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల సమయం అయినా చలి తీవ్రత తగ్గడం లేదు. శ్రీకాకుళంలోని పలు పల్లె ప్రాంతాల్లో పొగ మంచం అలుముకుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాత్రి సమయాల్లో 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది. డిసెంబర్ నెల దగ్గర కావస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిణుపులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.
మందస మండలం, సాబకోట పంచాయితీ, బుడంబో గ్రామ సమీపాన పులి సంచరిస్తున్నట్లు మంగళవారం కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై మందస వెళ్లి తిరిగి సాబకోట వెళ్తుండగా చిన్న బరంపురం నుంచి బుడంబో వెళ్లే తారు రోడ్డులో పులి రోడ్డు దాటుతుండగా చూసినట్లు మదన్మోహన్ బెహరా అనే వ్యక్తి సాబకోట సచివాలయానికి వెళ్లి సమాచారం అందజేశారు. సచివాలయ సిబ్బంది పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.