India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.
మందస మండలం, సాబకోట పంచాయితీ, బుడంబో గ్రామ సమీపాన పులి సంచరిస్తున్నట్లు మంగళవారం కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై మందస వెళ్లి తిరిగి సాబకోట వెళ్తుండగా చిన్న బరంపురం నుంచి బుడంబో వెళ్లే తారు రోడ్డులో పులి రోడ్డు దాటుతుండగా చూసినట్లు మదన్మోహన్ బెహరా అనే వ్యక్తి సాబకోట సచివాలయానికి వెళ్లి సమాచారం అందజేశారు. సచివాలయ సిబ్బంది పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.
పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా యువకుడు IPLకు ఎంపికైన విషయం తెలిసిందే. టెక్కలికి చెందిన త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య దంపతుల కుమారుడు విజయ్కు మొదటి నుంచి క్రికెట్ ఆసక్తి. ఈక్రమంలో పలు పోటీల్లో సత్తాచాటాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30లక్షల బేస్ ప్రెస్కు దక్కించుకుంది. విజయ్ తండ్రి వెంకటకృష్ణరాజు సమాచారశాఖ ఉద్యోగి, తల్లి లావణ్య గృహిణి. విజయ్కు పలువురు అభినందనలు తెలిపారు.
సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి నేరుగా శబరిమల (కొల్లం) వరకు ప్రత్యేక రైలును డిసెంబరు 1 నుంచి జనవరి 19 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని, రైలు ప్రారంభించడంపై సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ సురక్షితంగా, శుభప్రదమైన యాత్ర జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.