India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అపరిష్కృతంగా ఉన్న (క్రైమ్ అగైనెస్ట్) మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ శ్రీ కేవీ.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండల ఎంపీపీ గ్రామమైన మోదుగులపుట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పశువుల పాక కన్నా అధ్వానంగా ఉంది. కనీసం తలుపులు (తడకలు) లేకుండా ఇరుకైన ప్రదేశంలో ఐదుగురు చిన్నారులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వీరితోపాటు ముగ్గురు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు వస్తూ ఉంటారు. అదే ఇరుకైన గదిలో వంట సామగ్రితో పాటు నాడు-నేడు సామగ్రి కూడా అక్కడే భద్రపరిచారు.
అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మావోయిస్టు ముఖ్యనేత చలపతికి శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం ఉంది. చలపతి మృతితో జిల్లాలోని ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడింది. పలాస మండలం బొడ్డపాడు గ్రామం అల్లుడు చలపతి. పీపుల్స్ వార్ పార్టీలో చలపతి కీలకపాత్ర పోషించారు. అప్పట్లో బొడ్డపాడు గ్రామానికి చెందిన రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లిచేసుకుని ఆమెను కూడా అజ్ఞాత జీవితంలోకి తీసుకువెళ్లిపోయారు. 1988 నుంచి 1994 వరకు ఉద్దానం ప్రాంతంలో పార్టీని నడిపించారు.
ప్రతి పోలీసు అధికారి అంకితభావంతో విధులు నిర్వర్తించి 2025 ఏడాదిలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, మహిళలు చిన్నారులపై జరిగేనేరాలు, సైబర్ నేరాలు, గ్రేవ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు, తదితర కేసులపై సమీక్షించారు.
శ్రీకాకుళం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. పార్టీ నూతన అధ్యక్షులుగా సిరిపురపు రాజేశ్వరరావు పేరును బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ రాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, సుహాసిని ఆనంద్, పూడి తిరుపతి రావు, తదితరులు హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని అన్నిపోస్ట్ ఆఫీస్లలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తేదీన సుకన్య సమృద్ధియోజన మెగా మేళా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. 10 సంవత్సరాలోపు బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. ఒక సం.లో కనీసం 250/- గరిష్ఠంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18సం. నిండిన తర్వాత విద్య, వివాహం నిమిత్తం 50% వరకు నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి పట్ల టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జమ్మూలో నిన్న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సైనికుడు కార్తీక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పలాస మండలం రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ ప్రాంతాల్లో నీలావతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీరావు(50) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆయనకు జేసీబీ ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.