Srikakulam

News July 2, 2024

శ్రీకాకుళం: మీకోసంలో 204 అర్జీలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలనీ సమూన్ ఆదేశించారు. సోమవారం జడ్పీ హాల్లో మీకోసం కార్యక్రమంలో 204 మంది నుంచి అర్జీలు వివిధ శాఖల అధికారుల స్వీకరించారు.

News July 1, 2024

శ్రీకాకుళం:‘ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్‌ను ప్రభుత్వం గుర్తించాలి’

image

శ్రీకాకుళం ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ రవాణా మంత్రిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. జిల్లా నుంచి దాదాపుగా ఆర్టీసీలో 7,500 మంది పని చేస్తున్నామని. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆర్టీసీలో భాగం చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించమని వినతిపత్రం అంజేశారు. ముత్యాలు, కిరణ్, నవీన్, అనిల్, కేశవ, ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

* శివారు భూములకు నీరు అందించడమే లక్ష్యం: కలెక్టర్ * జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆసరా పెన్షన్లు 96.8 % పంపిణీ పూర్తి* పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు* డెంగ్యూ వ్యాధి నివారణకు చర్యలు: కలెక్టర్* ప్రజా సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ* గొట్టా బ్యారేజీ నుంచి 700 క్యూసెక్కుల నీటి విడుదల* నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్: ఎచ్చెర్ల* ఒడిశాలో ఎచ్ఛర్ల యువకుడి మర్డర్

News July 1, 2024

SKLM: శివారు భూములకు నిరంధించడమే లక్ష్యం: కలెక్టర్

image

వంశధార నీటిని వజ్రపు కొత్తూరులోని చివరి పొలం వరకూ అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ జిలానీ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకి లేకుండా పూర్తిస్థాయిలో పూడిక తీత, తుప్పల తొలగింపు పనులను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

News July 1, 2024

ఒడిశా బీచ్‌లో ఇచ్ఛాపురం యువకుడి మర్డర్

image

ఒడిశాలోని సున్నాపురం బీచ్‌లో ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన ఆశి బాలును పట్టణంలోని బెల్లుపడకు చెందిన కొందరు యువకులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఆదివారం బాలు తన స్నేహితులతో బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారితో బాలుకు ఘర్షణ జరిగింది. అది కాస్తా వివాదంగా మారడంతో నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 1, 2024

ఇన్‌స్టంట్ ఎగ్జామ్ అర్హుల జాబితా

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ తక్షణ పరీక్ష (INSTANT EXAM)కు సంబంధించి అర్హుల జాబితా సోమవారం విడుదలయ్యాయని ఎగ్జామినేషన్స్ డీన్ తెలిపారు. అలాగే కాలేజీలకు పరీక్షలో అర్హులైన విద్యార్థుల జాబితాను పంపనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News July 1, 2024

టెక్కలి: కుటుంబంలో అందరూ వైద్యులే: డాక్టర్స్ డే స్పెషల్

image

టెక్కలి మండలం పోలవరానికి చెందిన ఓ కుటుంబంలోని తర్వాతి తరం అంతా వైద్యులే. రాజశేఖర్, విజయ్ కుమార్, దయ సోదరులు ముగ్గురు వైద్యులు. ఇంటికొచ్చిన కోడళ్లు కూడా వైద్యులు కావడం విశేషం. రాజశేఖర్ (పీడియాట్రిక్స్), భార్య స్రవంతి (గైనకాలజిస్ట్), విజయ్(జనరల్ మెడిసిన్) భార్య రోజా(MBBS), దయ(MBBS) పూర్తి చేసి ఎండీ జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. దయ, రోజా మినహా మిగిలినవారు టెక్కలి జిల్లాసుపత్రిలో సేవలు అందిస్తున్నారు.

News July 1, 2024

సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాధిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

News July 1, 2024

రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా టాప్-1

image

పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 లబ్ధిదారులున్నారు. ఈ నేపథ్యంలో వీరికి రూ.21.17 కోట్లను ఎన్టీఆర్ పింఛన్ల కానుకగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 82.63% లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీని తర్వాత నెల్లూరు జిల్లా 3,13,757 మందితో 2వ స్థానంలో ఉండగా.. 1,26,813 మంది లబ్ధిదారులతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో ఉంది.

News July 1, 2024

SKLM: జిల్లా వ్యాప్తంగా 21,92,15 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 21,92,15 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి నాయకులతో సహా ఉద్యోగులు శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు బాబు వచ్చాడు.. పెన్షన్ ఇచ్చాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.