India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ సభ్యులు దుర్మరణం పాలైన విషాదకర ఘటన తెలిసిందే. ఈ ఘటనలో మందస మండలం బాహడపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బి షణ్ముఖరావు (21) మృతి చెందారు. ఇస్కాన్ ఆలయంలో భక్తునిగా ఉంటూ సంకీర్తనలకు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అతుసూరి కవిటి గ్రామానికి చెందిన శాన్వీ లట్టాల సత్తాచాటింది. అస్సాం వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో శనివారం శాన్వీ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఈ పోటీలకు ఎంపిక కాగా అందులో శాన్వీ ఒకరు కావడం విశేషం.
అర్హులైన పేద కుటుంబాలకు చెందిన వారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందడానికి ఈ నెల 31వ తేదీ నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం అర్హులు ఆధార్ కార్డ్తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్తో బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి, గ్యాస్ కనెక్షన్ నంబర్ కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వెంబడి ప్రవహిస్తున్న ప్రధాన నదులైన నాగావళి, వంశధార నదుల అనుసంధానం జూన్ 2025 నాటికి పూర్తిచేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పలు ప్రాజెక్టుల ముఖ్య అధికారులతో కలెక్టరేట్లో శనివారం జేసీ అహ్మద్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధానానికి సంబంధించి ఇప్పటికే రూ.106 కోట్ల ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
300 ఏళ్ల నాటి పురాతన భవనం కలెక్టరేట్ వద్దనున్న డచ్ భవనం చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం MLA గొండు శంకర్, తదితర అధికారులతో కలసి ఆయన డచ్ బంగ్లా వద్ద పర్యటనకు వచ్చారు. ఢిల్లీ గేట్ తరహాలో డచ్ భవన్ చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని, గ్రీనరీని ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో మూడు ప్రభుత్వ, 20 ప్రైవేటు ఐటిఐల్లో మిగిలిన సీట్లకు ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు మరి కొద్ది గంటల్లో ముగుస్తుంది. ఈ మేరకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేటి సాయంత్రం లోపు iti.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం సమీప ప్రభుత్వ ఐటీఐకి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 28న ప్రభుత్వ ఐటీఐల్లో, 30న ప్రైవేటు ఐటిఐల్లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మొబైల్ ఎవరైనా పోగొట్టుకున్న, ఎవరైనా దొంగిలించిన వెనువెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి కేసు నమోదు చేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం స్పష్టం చేశారు. అనంతరం CEIR పోర్టల్ http://www.ceir.gov.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ వెబ్ సైట్లో మీ మొబైల్ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఇలా చేస్తే మీ మొబైల్ రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లాలో దానా తుఫాన్ ప్రభావం శుక్రవారం లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమదాలవలస, చీమలవలస, ఓవి పేట, గుత్తావల్లి, నిమ్మతోర్లాడ పరిసర గ్రామాల్లో రైతులు చేతికి రావలసిన పంట వర్షానికి పాడవుతుందని.. నిన్న ఒడిశాలో తుఫాన్ తీరం దాటే సమయానికి కాస్త ఆందోళన చెందారు. కానీ వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.
ఎచ్చెర్లలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డా.ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నవంబరు 4 నుంచి 18వ తేదీ వరకు, తృతీయ సంవత్సరం నవంబరు 20 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.
టెక్కలి నుంచి ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం ప్రాంతాలకు పలు ఆర్టీసీ సర్వీసులు శనివారం ప్రారంభం కానున్నట్లు టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని నూతన ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.