Srikakulam

News October 26, 2024

నరసన్నపేట: వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష

image

భార్య వేధింపులకు గురి చేస్తున్న భర్తకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. నరసన్నపేట స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఈ మేరకు ఆమె తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గాంధీనగర్-1లో నివాసం ఉంటే బోనెల సాంబశివరావు, భార్య నాగలక్ష్మీపై వేధింపులకు పాల్పడటంతో 2022లో నరసన్నపేట ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

News October 26, 2024

నరసన్నపేట: వేధింపుల కేసులో భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష

image

భార్య వేధింపులకు గురి చేస్తున్న భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఈ మేరకు ఆమె తీర్పునిచ్చారు. నరసన్నపేట పట్టణానికి చెందిన బోనెల నాగలక్ష్మి తన భర్త సాంబమూర్తి వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ వేల ఇరవై రెండులో ఫిర్యాదు చేశారని తెలిపారు.

News October 25, 2024

SKL: ఎస్సై వేధిస్తున్నాడని మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు.. విచారణకు ఆదేశం

image

ఆమదాలవలస నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఓ కేసు విషయంలో బయటకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. గతంలో కూడా ఆ ఎస్సైపై పలు ఆరోపణలు ఉన్నాయి.

News October 25, 2024

శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నేడే లాస్ట్

image

జిల్లాలో ఉండే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 25 సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 26 నుంచి 29 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

News October 25, 2024

శ్రీకాకుళం: డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. ఈనెల 21వ తేదీనే గడువు ముగియగా దాన్ని 25వ తేదీ వరకు అధికారులు గడువు పొడిగించారు. ఈ మేరకు అభ్యర్థులు rpr@tender.apepsocurement.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీ సాయంత్రం లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News October 25, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి పశుగణన సర్వే

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో శుక్రవారం నుంచి అఖిల భారత పశుగణన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పశుగణన సర్వే ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు వంటి అన్ని రకాల మూగజీవాల లెక్కింపు చేపడతారు. దీనికోసం పశుసంవర్ధక శాఖ 257 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. రోజుకు కనీసం 50 ఇళ్లల్లో సర్వే చేయనున్నారు. పట్టణాల్లో కూడా సర్వే చేస్తారు.

News October 25, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 2, 3 సంవత్సర పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2010-2011 అడ్మిటెడ్ బ్యాచ్ 2, 3వ సంవత్సర పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. రెండో సంవత్సర పరీక్షలు నవంబర్ 4 నుంచి ప్రారంభమై 18వ తేదీతో ముగుస్తాయి. అలాగే మూడో సంవత్సర పరీక్షలు నవంబర్ 20 నుంచి ప్రారంభమై డిసెంబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల జరగనున్నాయి.

News October 25, 2024

శ్రీకాకుళం: తీరం దాటిన దానా తుఫాన్ 

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ గురువారం రాత్రి తీరం దాటినట్లు APSDMA అధికారులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం బిత్తర్కనిక-ధమ్రా సమీపంలో గురువారం రాత్రి 1.30 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో తీరం దాటినట్లు వెల్లడించారు. తీరం దాటిన తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం నాటికి బలహీనపడుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2024

నందిగాం: పాముకాటుతో వివాహిత మృతి

image

నందిగాం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన కోనారి జయలక్ష్మి(24) పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ నెల 21వ తేదీన రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము కాటువేసింది. దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలికి భర్త సోమేశ్వరరావు, కార్తీక్, హర్షకుమార్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

News October 25, 2024

శ్రీకాకుళం: పైలట్‌ అవతారం ఎత్తిన రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొద్దిసేపు పైలట్‌గా మారారు. ప్రఖ్యాత ఎయిర్‌బస్ సంస్థ దక్షిణాసియా స్థాయిలో పైలట్‌లకు సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించేందుకు ఢిల్లీలో ప్రధాన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు కొద్దిసేపు విమాన కాక్‌పిట్‌లో గడిపారు. విమానాన్ని నడిపే విధంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కాక్‌పిట్‌లో కూర్చుని ఆ అనుభూతి చెందారు.

error: Content is protected !!