Srikakulam

News January 22, 2026

SKLM: ‘లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం’

image

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు కేవలం వైద్య అవసరాలకే పరిమితం చేయాలన్నారు. మితిమీరితే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. DMHO అనిత ఉన్నారు.

News January 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

రోడ్లు లేని గ్రామాలు ఉండవు: అచ్చెన్న
రథసప్తమి ఏర్పాట్లు పరిశీలనలో ఎమ్మెల్యే గొండు శంకర్
చేనేత కార్మికుల వృద్ధికి కృషిచేస్తాం: ఎమ్మెల్యే గోవిందరావు
శ్రీకాకుళం: ఆలయాల భద్రత పై ప్రత్యేక దృష్టి
సామాన్య భక్తులకు ప్రాధాన్యత: అరసవల్లి ఈఓ
భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: హోంమంత్రి అనిత
కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు

News January 21, 2026

SKLM: తమన్ మ్యూజికల్ షో‌కు పగడ్బందీ ఏర్పాట్లు

image

తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీగా బారికేడ్లు నిర్మించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు కింది స్థాయి అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు సక్రమంగా ఉండాలన్నారు.

News January 21, 2026

వినతులు స్వీకరించిన అచ్చెన్న

image

ప్ర‌జ‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడాలని పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు.

News January 21, 2026

కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. ఎక్కడి వాళ్లు చేశారంటే!

image

కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

News January 21, 2026

SKLM: రెండో రోజు హెలికాఫ్టర్ రైడ్‌లో ఎంత మంది విహరించారంటే?

image

రథసప్తమి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌ను శ్రీకాకుళం వాసులు ఆస్వాదిస్తున్నారు. మంగళవారం రెండో రోజు దాదాపు 174 మంది హెలికాఫ్టర్‌లో విహరించగా రూ.3,82,400 వసూలయ్యాయి. రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.

News January 21, 2026

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

image

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం

➱22న (ఆదివారం) జాతర ప్రారంభం

➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు

➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.

చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

News January 21, 2026

ప్రజలకు అందించే సేవలో జవాబుదారితనం ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ప్రజలకు అందించే సేవలలో జవాబుదారీతనం ఉండాలని, లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలుతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 1B అడంగల్ జారీలో జాప్యం రాకూడదన్నారు.

News January 21, 2026

SKLM: జైలులో ఉన్న ముద్దాయిల కేసులు త్వరితగతిన పరిష్కరించాలి

image

జైలులో ఉన్న ముద్దాయిల సమస్యలు త్వరితగతన పరిష్కరించాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, గర్భిణీలకు వీలైనంతవరకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. దీనివలన జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుతుందని పేర్కొన్నారు. ASP కె.వి.రమణ, డి.ఆర్.ఓ లావణ్య ఉన్నారు.

News January 21, 2026

SKLM: జైలులో ఉన్న ముద్దాయిల కేసులు త్వరితగతిన పరిష్కరించాలి

image

జైలులో ఉన్న ముద్దాయిల సమస్యలు త్వరితగతన పరిష్కరించాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, గర్భిణీలకు వీలైనంతవరకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. దీనివలన జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుతుందని పేర్కొన్నారు. ASP కె.వి.రమణ, డి.ఆర్.ఓ లావణ్య ఉన్నారు.