India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి సందర్బంగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజు నివాళులు అర్పించారు. 55వార్డు ధర్మానగర్లో మంగళవారం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు రాష్టాల ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జిల్లా మహిళ వైసీపీ అధ్యక్షురాలు రమణి కుమారి ఉన్నారు.
విశాఖ పాత జైల్ రోడ్డులోని ఫుడ్ కోర్టులో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో షాప్ యజమాని తలో రూ.1000 ఇవ్వాలంటూ ఫుడ్ కోర్టులోని ఓ వర్గానికి చెందిన ప్రెసిడెంట్ సోమవారం రాత్రి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం ఫుడ్ కోర్టులో వందకు పైగా షాపులున్నాయి. ఆ డబ్బులతో ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేస్తారని తెలుస్తోంది.
విశాఖ రైల్వే స్టేషన్లో అక్రమంగా బంగారంతో సంచరిస్తున్న ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.2కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.2.2ంకోట్లు ఉంటుందని అంచనా వేశారు. బిల్లులు సక్రమంగా లేకపోవడంతో ఆ వ్యక్తులతో పాటు బంగారాన్ని జీఎస్టీ అధికారులకు అప్పగించామన్నారు. ఆ వ్యక్తులు బరంపూర్ నుంచి విశాఖకు బంగారంతో వచ్చినట్లు గుర్తించామని ఆర్పీఎఫ్ సీఐ రామకృష్ణ తెలిపారు.
సింహాచలంలో బదిలీ అయిన ఓ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. సుదీర్ఘకాలం సింహాచలం ఆలయంలో పనిచేసిన DVS రామరాజు (హరి) ఇటీవల వన్టౌన్లోని కనకమహాలక్ష్మి ఆలయ ఇంజినీరింగ్ అధికారిగా బదిలీ అయ్యారు. అయినప్పటికీ వారానికి రెండు, మూడు రోజులు సింహాచలంలో దర్శనాలు, ప్రొటోకాల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లేకుండా ఈ విధంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకువాలన్నారు.
విశాఖ కమిషనరేట్ పరిధిలో నాలుగు హోంగార్డ్ పోస్టులకు సీపీ శంకబ్రత బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో కనీసం 55% మార్కులతో డిగ్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్లో కనీసం 55% మార్కులతో 01 సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు అప్లికేషన్ సీపీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
క్యాన్సర్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలోని కేజీహెచ్తో పాటు పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నామని, వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన యంత్రాలను ఆయన ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1:45కు నావల్ కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నోవాటల్కి వెళ్లి అక్కడ జరగనున్న ఈస్ట్ కోస్ట్ మేరీ టైం అండ్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4:30 విశాఖ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి వెళతారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం (సెప్టెంబర్ 01, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.