India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు JEE పరీక్షకు హాజరవలేదనే విషయంపై విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో 7గంటలకు రిపోర్ట్ చేయాలని, 8:30 గంటలకు గేట్ మూసివేయనున్నట్లు హాల్ టికెట్లో ఉందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ రూట్లో 8:41గంటలకు వెళ్లారన్నారు. చినముషివాడలోని పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు గాను సర్వీస్ రోడ్లలో 8:30 వరకు ట్రాఫిక్ ఆపలేదని స్పష్టం చేశారు.

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యడెండ్గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.

విశాఖలో YCPకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పెట్రో కెమికల్ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్గా పనిచేశారు. 2014లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భార్య కూడా వైసీపీలో పదవులు పొందారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్కు పంపిన లేఖలో పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పై సీపీ శంఖబ్రత బాగ్చి అవగాహనా కల్పించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అవగాహనా కల్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి మెడికల్ భద్రత అవసరమన్నారు. కంట్రోల్ రూమ్లో 24/7 పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్ ద్వారా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ను పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ చూసుకుంటుందన్నారు.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీ వసతి గృహంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతిగృహంలో ఉన్న వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.

తండ్రి బైకు కొని ఇవ్వలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో వెలుగు చూసింది. రామా టాకీస్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తీక్ తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కార్తీక్ కొద్దిరోజులుగా బైక్ కోసం తండ్రితో గొడవ పడేవాడు. బైకు కొనకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.