India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ లా స్టూడెంట్ <<14651987>>అత్యాచార ఘటనపై<<>> హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోంమంత్రి అన్నారు.
విశాఖలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లా విద్యార్థినిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వంచించి తన స్నేహితులతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విశాఖ టూ టౌన్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అత్యాచారానికి గురైన విద్యార్థిని మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ విలాసాలకు భవనం నిర్మించుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కోసం వాటిని నిర్మించామని వైసీపీ నాయకులు ఆ ఆరోపణలకు తిప్పికొడుతున్నారు. అయితే ఆ భవనాలను రాష్ట్ర ఆదాయ వనరులుగా మలచాలని పలువురు సూచిస్తున్నారు. మరి భవనాలు దేనికి వినియోగిస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను జిల్లా స్థాయికి తీసుకురావద్దన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
విశాఖలో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయసంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. కొత్తవీధి శివారు జంక్షన్లో ఓ వ్యక్తిని హత్య చేశారు. సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో డిఎస్పీ మోహన్, టౌన్ సీఐ గోవిందరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీ కంఠారం శివారు బంధమామిళ్ల గ్రామానికి చెందిన వడగం సత్తిబాబు అనే రైతుకు చెందిన పొలంలో చిన్న సైజు శివలింగం బయట పడింది. ఆదివారం రైతు పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఈ శివలింగం బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. అసలే కార్తీక మాసం, శివలింగం ప్రత్యక్షం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్ సందర్శకులతో ఆదివారం కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో వనయాత్రలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. ఆదివారం ఒక్కరోజే 10,006 మంది పర్యాటకులు పార్క్ను సందర్శించారు. ఈ ఒక్కరోజు రూ.7,75,530 ఆదాయం వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు.
పరవాడ ఎస్ఐ ఎం. రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్లో అప్లోడ్ చేశారు. ఈ పోస్టపై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.