Visakhapatnam

News April 22, 2024

విశాఖ: టీడీపీలో టికెట్లు మార్పు.. వారి నిర్ణయంపై ఉత్కంఠ..!

image

మాడుగుల, పాడేరు అభ్యర్థులను మార్చిన TDP.. వారికి B-ఫామ్‌లు సైతం ఇచ్చేసింది. మాడుగులలో పైలా ప్రసాద్‌‌కు బదులు బండారుకి, పాడేరులో రమేశ్ నాయుడును తప్పించి గిడ్డి ఈశ్వరికి టికెట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు ఈరోజు నామినేషన్ వెయ్యనున్నారు. అయితే ఇప్పటికే ప్రసాద్, రమేశ్ నామినేషన్లు వేశారు. పాడేరులో రెబల్ అభ్యర్థిగా రమేశ్ నాయుడు పోటీలో ఉంటారని వార్తలు వస్తుండగా.. పైలా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

News April 22, 2024

ఉమ్మడి విశాఖలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ ఎం.శ్రీభరత్(టీడీపీ): విశాఖ ఎంపీ
➤ వంగలపూడి అనిత(టీడీపీ), కంబాల జోగులు(వైసీపీ): పాయకరావుపేట ఎమ్మెల్యే
➤ బండారు సత్యనారయణ(టీడీపీ): మాడుగుల ఎమ్మెల్యే
➤ బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి ఎంపీ
➤ గిడ్డి ఈశ్వరి(టీడీపీ): పాడేరు ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ రేగం మత్స్యలింగం(వైసీపీ): అరకు ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

మే 10న సింహాచలం చందనోత్సం

image

ప్రతి ఏటా సింహాచలం ఆలయంలో నిర్వహించే చందనోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి అన్నారు. వచ్చే నెల 10న నిర్వహించే చందనోత్సవం కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

News April 22, 2024

సింహాచలం అప్పన్న సన్నిధిలో పండిత సదస్సు

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.

News April 21, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 21, 2024

విశాఖ: ఏడుసార్లు పోటీ.. నాలుగుసార్లు గెలుపు

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు బీ-ఫారమ్ అందజేసిన సంగతి తెలిసిందే. ఏడుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. నాలుగు సార్లు గెలిచారు. 1989, 1994 ,1999, 2004లో పరవాడ నుంచి పోటీ చేసి.. మూడుసార్లు గెలుపొందగా 2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009, 2014, 2019లో పెందుర్తి నుంచి పోటీచేయగా.. 2014లో గెలిచారు. 1997-98లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

News April 21, 2024

విశాఖ: రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోందని వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 9,111 ట్రిప్పులను నడుపుతుండగా, గతేడాది కంటే 2,742 ట్రిప్పులు అధికమన్నారు. వాల్తేర్ డివిజన్‌లో 52 వేసవి ప్రత్యేక సర్వీసులు తిరుగుతున్నాయని, మరో 12 జతలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.

News April 21, 2024

అనకాపల్లిలో లెక్చరర్ సూసైడ్!

image

అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 21, 2024

కంచరపాలెం: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊర్వశి జంక్షన్ జాతీయ రహదారి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీఐ భాస్కరరావు నేతృత్వంలో ఏఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

విశాఖ: ‘నేడు ఉక్కు శిబిరం వద్ద భారీ స్థాయిలో నిరసన’

image

కూర్మన్నపాలెం ఉక్కు శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ కో కన్వీనర్ అయోధ్య రామ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశాన్ని అన్ని పార్టీలు ప్రధాన అజెండాగా చేర్చాలని కోరుతూ.. ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 9:30 గంటలకు నిరసన ప్రారంభం అవుతుందన్నారు.