India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంలో కూటమి నెగ్గటంతో ఆశావాహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ పదవి TDPకి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే డిప్యూటీ మేయర్ కోసం పలువురు TDP మహిళా కార్పొరేటర్ల భర్తలు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కొత్తగా కూటమిలో చేరిన వారు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. మరి విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి వస్తుందో కామెంట్ చెయ్యండి.
జీవీఎంసీలో డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది. 74 ఓట్లతో అవిశ్వాసంపై ఓటింగ్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. సరిగ్గా వారం క్రితం మేయర్పై అవిశ్వాసం గెలిచిన కూటమి ప్రభుత్వం నేడు డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాసం కూడా గెలిచింది. దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
విశాఖ డిప్యూటీ మేయర్ జీయ్యని శ్రీధర్పై నేడు అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ అవిశ్వాసం ఉండనుంది. అయితే ఇప్పటికే కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు జిల్లా కలెక్టర్ అవిశ్వాసం ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే జీవీఎంసీ మేయర్ పీఠంను కూటమి కైవసం చేసుకోవడంతో, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం నెగ్గుతామని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మంజూరు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పలు అవకతవకలు జరిగాయని పలువురు విశాఖ ప్రజా ప్రతినిధులు మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేయించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు మంత్రి సూచించారు. నిజనిర్ధారణ చేయాలని, అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తలసేమియా బాధితులు కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 3k,5k,10k రన్ నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. తలసేమియాపై అవగాహన కలిగించేందుకు విశాఖ వేదికగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ 4నెలలకు ఒకసారి రక్తదానం చేసి, వారికి భరోసా కల్పిద్దామని భువనేశ్వరి అన్నారు.
విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం డీఆర్సి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు. పరిపాలనాపరమైన అంశాల్లో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని, కాలయాపన చేయరాదని పేర్కొన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లోని అవసరాలకు సరిపడా సామర్థ్యం కలిగిన వీధి దీపాలు వేయాలని, దీని కోసం ముందుగా ఆడిట్ చేయాలని సూచించారు.
భారత ప్రభుత్వం జారీ చేసిన పాకిస్థాన్ వీసాలను రద్దు ఉత్తర్వులు విశాఖ అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా రెవిన్యూ అధికారి పేరున ఒక ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య దీర్ఘకాలిక దౌత్య వీసాలు మినహా మిగతా అన్నిటిని భారత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఎవరైనా పాకిస్థాన్కు చెందిన వారు ఉంటే వెంటనే విడిచి వెళ్లిపోవాలని సూచించారు.
ఆంధ్ర మెడికల్ కళాశాలలో నిర్మించిన క్యాబ్ బిల్డింగ్ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళంలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం సా.6 గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్వ విద్యార్థుల నిధులతో ఈ క్యాబ్ బిల్డింగ్ నిర్మించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం, ఏఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని వీసాలు ఏప్రిల్ 27తో, వైద్య వీసాలు ఏప్రిల్ 29తో రద్దు అవుతాయని విశాఖ CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్ళిపోవాలన్నారు. అక్రమంగా ఎవరైనా నివసిస్తన్నట్లు గుర్తిస్తే వారితో పాటు వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం చంద్రబాబు శనివారం విశాఖ రానున్నారు. ఉదయం 11.25కి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్తారు. శ్రీకాకుళంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం 5.45కి విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరి 7:25 కు షాప్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
Sorry, no posts matched your criteria.