Visakhapatnam

News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 363 మద్యం షాపులు?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 363 మద్యం షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో మొత్తం 161 షాపులకు గానూ అన్ రిజర్వ్ షాపులు 141, కల్లుగీత కార్మికులకు 19, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో మొత్తం 37 షాపులన్నీ అన్ రిజర్వ్ చేయగా.. అనకాపల్లి జిల్లాలోని మొత్తం 165 షాపులకు అన్ రిజర్వ్ షాపులు 151, కల్లుగీత కార్మికులకు 14 షాపులు కేటాయించినట్లు సమాచారం.

News September 27, 2024

విశాఖ: నేటి నుంచి రెండురోజుల పాటు జాబ్ మేళా

image

కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులు పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం నిర్వహించే జాబ్ మేళాలో డిప్లమో ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.డిప్లమో, బిటెక్ మెకానిక్ అండ్ మెకట్రానిక్ కోర్సులు చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు.

News September 27, 2024

World Tourism Day: విశాఖలో నేడు ఎంట్రీ ఫ్రీ

image

VMRDA పరిధిలోని పార్కుల్లో శుక్రవారం ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు కమిషనర్ విశ్వనాథన్ వెల్లడించారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా సబ్‌మెరై‌న్‌, వుడా పార్క్, కైలాసగిరి, YSR సెంట్రల్ పార్క్, సీ హారియర్, టీ.యూ 142, తెలుగు మ్యూజియంతో పాటు తదితర పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. >>Share it

News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదుగురు తహశీల్దార్లకు బదిలీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో ఐదుగురు తహశీల్దారులకు బదిలీ జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మనాభం తహశీల్దార్ ఎం.ఆనంద్ కుమార్‌ను పెందుర్తికి, పెందుర్తి తహశీల్దార్ కే.వేణుగోపాల్‌ను VMRDAకి, అక్కడ పనిచేస్తున్న కే.ఆనందరావును పద్మనాభంకు బదిలీ చేశారు. సబ్బవరం తహశీల్దార్ రవికుమార్‌ను అల్లూరి జిల్లాకు, కలెక్టరేట్ నుంచి చిన్నికృష్ణను అనకాపల్లికి బదిలీ చేశారు.

News September 27, 2024

విశాఖలో NTR ఫ్యాన్స్ నిరసన

image

విశాఖ సంగం-శరత్ థియేటర్ వద్ద NTR నటించిన ‘దేవర’చిత్రం విడుదల సందర్భంగా డీజే ఏర్పాటుపై పోలీసులకు ఫ్యాన్స్‌కు మధ్య గురువారం రాత్రి వాగ్వివాదం జరిగింది. థియేటర్ వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఫ్యాన్స్ నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డీజే ఏర్పాటుకు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు.

News September 27, 2024

పాడేరు: ఈనెల 27న మీకోసం కార్యక్రమం రద్దు

image

ఈనెల 27వ తేదీ శుక్రవారం జరగనున్న మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఫిర్యాదుదారులకు ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీఓ ప్రకటించారు. ఫిర్యాదుదారులు గమనించి నీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని పిఓ విజ్ఞప్తి చేశారు.

News September 26, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీ అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం గురువారం నియమించింది. విశాఖకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను, అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడిని నియమించింది. అటు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పాడేరు MLA విశ్వేశ్వర రాజుకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు విశాఖ వెస్ట్ ఇన్‌ఛార్జ్‌గా మళ్లా విజయప్రసాద్‌ను నియమించారు.

News September 26, 2024

విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్‌లో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు కోరారు.

News September 26, 2024

అమెరికా పర్యటనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆ సంఘం ఆహ్వానం మేరకు ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వాషింగ్టన్ డీసీలోని లీస్బర్గ్ నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. తిరిగి అక్టోబరు 8న రాష్ట్రానికి చేరుకుంటారు.

News September 26, 2024

విశాఖలో హర్షసాయి బంధువులను విచారించిన పోలీసులు?

image

హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న విశాఖలో HYD పోలీసులు హర్షసాయి బంధువులను విచారించినట్లు సమాచారం. అయితే అతను విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.