India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టేడియం చుట్టూ 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. నగరం నుంచి వెళ్లే వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రేక్షకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలన్నారు.

మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలో ఆర్టీసీ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు, సీపీ శంఖబ్రత బాగ్చి ఉన్నారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మాధవధారలో జలధార వద్ద సింహాచలం దేవస్థానం ఉప దేవాలయలు, మాధవస్వామి ఆలయం ఉన్నాయి. మాఘ మాసంలో అధిక సంఖ్యలో జలధార స్నానం చేసేందుకు భక్తులు వస్తుంటారు. గతంలో లక్షల రూపాయల ఖర్చుపెట్టి స్నానాలు చేసేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. మహిళల దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్స్ కూడా లేవు. దీనిపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఋషికొండ ఐటీ జంక్షన్ సమీప సముద్రంలో ‘డైవ్ అడ్డా’ ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సీఈఓ భద్రం రామిశెట్టి పర్యవేక్షణలో డైవ్ మాస్టర్స్ బాబి, విష్ణవ్, అర్జున్, స్కోబా డైవర్ సంతోష్ కనకాల సుమారు 15 అడుగుల లోతుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడటం పట్ల పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కైలాసగిరిలోని గ్లాస్ బ్రిడ్జి నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. దేశ, ప్రజా రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న డిఫెన్స్, పోలీస్ శాఖల సిబ్బందికి గౌరవపూర్వకంగా ఈరోజు ప్రత్యేక రాయితీని ప్రకటించారు. టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు RJ అడ్వెంచర్స్ నిర్వాహకులు రాజేష్ తెలిపారు. అర్హులైన సిబ్బంది తమ ఐడీ కార్డులను చూపి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నాటి పోక్సో కేసులో పరారీలో ఉన్న నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితుడు బెయిల్ పై వెళ్లి 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందం యూపీలోని బలరాంపూర్లో ఇతడిని పట్టుకుని నగరానికి తరలించింది. నిందితుడిని పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

విశాఖ నగరంలోని రేసవానిపాలెంలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఏయూ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం పోలీసులు వచ్చి తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నేవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెండా వందనం జరిగే మైదానంలో ఆదివారం పైలట్ వాహనానికి ట్రయిల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలియజేస్తూ స్టాళ్లను, శకటాలను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు.
Sorry, no posts matched your criteria.