India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్యాన్సర్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలోని కేజీహెచ్తో పాటు పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నామని, వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన యంత్రాలను ఆయన ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1:45కు నావల్ కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నోవాటల్కి వెళ్లి అక్కడ జరగనున్న ఈస్ట్ కోస్ట్ మేరీ టైం అండ్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4:30 విశాఖ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి వెళతారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం (సెప్టెంబర్ 01, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
పెద్ద రుషికొండలో భవనం పైనుంచి జారిపడి మృతి చెందింది. ఆరిలోవ ఉంటున్న చందక సత్యాలు (48) భవన నిర్మాణ కార్మికులరాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక ఉన్న భవనంలో మరమ్మతుల పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడడంతో మృతి చెందింది.
సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 2న విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిపాడ్ను చెక్ చేసి అక్కడ చేపట్టవలసిన పనులపై చర్చించారు. అనంతరం నోవాటెల్ వద్ద ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత, ఆర్డీవో శ్రీలేఖ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాదిరి రంగాసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై, రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవచేస్తున్న 35 మంది ప్రతినిధులను సేవారత్న అవార్డులతో సత్కరించారు.
మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతో YCP బలోపేతం అవుతుందని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కుంభారవి బాబు, ఇతర నేతలతో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ ఎస్ఎ రెహమాన్ శనివారం జనసేనలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రెహమాన్ గతేడాది వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమం ద్వారా విశాఖలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను రెస్క్యు చేసి వారికి ఆశ్రయం కల్పించారు. 243 మంది యాచకులలో వారి బంధువులకు, ఆశ్రయాల నిర్వాహకులకు అప్పగించారు. మిగిలిన 128 మంది యాచకుల వేలిముద్రల ఆధారంగా వారి ఆధార్ కార్డు వివరాలు తెలుసుకొని బంధువులకు సమాచారం అందించే కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ ప్రక్రియను సీపీ నేరుగా పర్యవేక్షించారు.
నూతన బార్ పాలసీలో భాగంగా 2025-28 VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శనివారం లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. జిల్లాలో 131 బార్లకు గాను 263 దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 67 బార్లుకు గాను గీత కులాలకు 10, జనరల్కు 57 బార్లు కేటాయించగా, మిగిలిన వాటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. పారదర్శకంగా ఈ లాటరీ విధానం జరిగిందని జేసీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.