Visakhapatnam

News August 19, 2024

అనధికార హాస్టల్ మూసివేయాలి: సీఎం చంద్రబాబు

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికార హాస్టల్ మూసివేయాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారు.

News August 19, 2024

26 నుంచి పోర్టు స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

విశాఖ‌ పోర్టు స్టేడియంలో ఆగ‌స్టు 26 నుంచి సెప్టెంబ‌ర్ 05వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ప‌క్కా ఏర్పాట్లు చేయాల‌ని వివిధ విభాగాల అధికారుల‌ను జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ ర్యాలీ విజయవంతం అయ్యేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News August 19, 2024

విశాఖలో దొంగతనాలు.. ఇలా అసలు చేయకండి!

image

విశాఖలో నిన్న ఘరానా<<13885131>> దొంగ<<>>ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనుషులు ఇంట్లో ఉన్నప్పుడే అతను దొంగతనాలు చేస్తాడు. కిటికీ పక్కనే డోర్ ఉంటే ఈజీగా గొళ్లెం తీసి దొరికినంత దోచేస్తున్నాడు. ‘గాలి కావాలని డోర్ పక్కన ఉండే కిటీకీలు ఓపెన్ చేయకండి. మెయిన్ డోర్‌తో పాటు కిటికీలు లాక్ చేసుకోవాలి. ఇళ్లు, బీరువా తాళాలను దస్తులు కింద, గోడలపై, షూల్లో పెట్టకండి’ అని డీసీపీ వెంకటరత్నం సూచించారు.

News August 19, 2024

విశాఖ KGH డాక్టర్‌పై CMకు ఫిర్యాదు

image

విశాఖ KGH ఎముకల విభాగంలోని ఓ డాక్టర్‌పై అల్లూరి జిల్లా ప్రజా పరిరక్షణ కమిటీ సమన్వయకర్త దాలినాయుడు CM చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ ఆపరేషన్లకు రోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. KGHకు వచ్చే రోగులను తన సొంత క్లినిక్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. మరి మీకు KGHలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి. 

News August 19, 2024

పాడేరు: ఈనెల 19 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

image

పాడేరు డివిజన్ పరిధిలో ఈనెల 19వ తేదీ సోమవారం నుంచి ఐదు రోజులపాటు 35 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ పరీక్షలకు వారితో పాటు ప్రజలు కూడా పరీక్షలు చేయించుకోవచ్చన్నారు.

News August 18, 2024

విశాఖ: 36ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..

image

గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో 1987-88లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడిన వారు సమావేశానికి హాజరయ్యారు. తరగతి గదుల్లో అప్పుడు చేసిన అల్లరి, చిలిపి పనులు తలుచుకొని ఆనందంతో పులకించారు. అనంతరం గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.

News August 18, 2024

కొత్తం చట్టంతో విశాఖలో 2 కేసుల నమోదు

image

క్రమబద్ధీకరించని పథకాల నిషేధ చట్టం కింద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖలో రెండు కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ శంఖబ్రత భాగ్చీ ‌ తెలిపారు. కమిషనరేట్లో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా డిపాజిట్లు సేకరించే కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చిందన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదు చేశామని చెప్పారు.

News August 18, 2024

స్టీల్ ప్లాంట్ గనుల లీజు పొడిగింపుపై హర్షం

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గర్భాం మాంగనీస్ గనుల లీజును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంపై చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బట్ హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News August 18, 2024

విశాఖలో ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నం

image

ఓ పాత నేరస్థుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. జీవీఎంసీ 52వ వార్డులో ఇద్దరు బాలికలు (6, 12ఏళ్లు) శనివారం సాయంత్రం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన పాత నేరస్థుడు మోహన్ కన్నా అలియాస్ పండు(24) వారి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారాని ప్రయత్నించాడు. ఇది చూసిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 18, 2024

విశాఖ: వైద్యుల సెలవులు రద్దు

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై వైద్యులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈక్రమంలో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద వైద్యుల సెలవులు రద్దు చేశారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావంతో కేజీహెచ్ క్యాజువాలిటీ విభాగం రోగులు లేక శనివారం వెలవెలబోయింది. అత్యవసర రోగుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 25 మంది వైద్యులను ఓపీతో పాటు వార్డుల్లో నియమించి సేవలు అందించారు.