India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వికసిత్ ఆంధ్ర-2047 లక్ష్యాలను సాధించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో వికసిత్ ఆంధ్రకు సంబంధించి యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధునాతన పద్ధతులను వినియోగించడం ద్వారా ఉత్పత్తులు పెంచవచ్చునని, తద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.యాక్షన్ ప్లాన్ తయారీలో అధికారులు విజన్తో పని చేయాలన్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ముగ్గురు శనివారం విశాఖ వస్తున్నారు. వందే భారత్ రైలులో న్యాయమూర్తులు కే.మన్మధరావు, రవి చీమలపాటి, రవినాథ్ తిల్హరి విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు అక్కడి నుంచి కారులో నేరుగా సర్క్యూట్ హౌస్కి వెళ్తారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి న్యాయమూర్తులు మధ్యాహ్నం రైలులో విజయవాడ వెళ్తారు.
ఎంతో విశేష సాంకేతిక పరిజ్ఞానం కలిగిన INS షాల్కీ జలాంతర్గామి శుక్రవారం తూర్పు నౌకాదళానికి చేరుకుంది. ఆ జలాంతర్తామిలో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి స్థానిక అధికారులు జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేవీ ఉన్నత అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సమీపంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యా.., ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ నావేల్ కమాండ్ ఆధ్వర్యంలో నౌకాదళ సిబ్బంది అత్యంత సాహసంతో డైవింగ్ చేస్తూ నీటి లోపల జాతీయ జెండాను ఎగరవేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. దాని స్ఫూర్తితో ఈ సాహస కార్యక్రమాన్ని నిర్వహించామని X (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఎన్డీఏ దూరంగా ఉండగా, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి దాన్ని ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్వో ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనమండలిలో త్వరలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలను వైసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ ప్రజలకు చనిపోయిన తర్వాతా డోలీ మోతలు తప్పడం లేదు. పెదబయటు మండలం బొంగరం పంచాయతీ కుంబుర్లకు చెందిన వంతల గంగమ్మ వైజాగ్ KGHలో అనారోగ్యంతో 14వ తేదీ చనిపోయింది. మృతదేహాన్ని 15వ తేదీ ఉదయం అంబులెన్సులో తీసుకెళ్లారు. ఊరికి 4 కిలోమీటర్లు దూరంలోనే డెడ్ బాడీని దింపేసి అంబులెన్సు వెళ్లిపోయింది. అక్కడి నుంచి గ్రామస్థులు డోలీలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
హోంమంత్రి వంగలపూడి అనిత స్వగృహంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనితతో పాటు కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు పూజా క్రతవులు జరిపించారు. ఈ పూజా కార్యక్రమానికి హోంమంత్రి పలువురు మహిళలను ఆహ్వానించారు.
విశాఖ స్థానిక సంస్థల MLCగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదనంగా మరో పదవి వస్తుందని YCPలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ పదవిని బొత్సకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ లీడర్ బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలరని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే జగన్కు లేని ప్రతిపక్ష హోదా ఆయనకు వస్తుంది.
శాసనమండలి ఎన్నిక నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ రోజు సాయంత్రం బొత్సకు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరణపత్రాన్ని అందించనున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.