Visakhapatnam

News September 25, 2024

వైసీపీకి రాజీనామా చేస్తున్నా: రెహమాన్

image

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏ రహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ హయాంలో విశాఖ-1 ఎమ్మెల్యేగా 1994లో గెలిచారు. 2001 నుంచి 2004 వరకు ఉడా ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. 2020 మార్చిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. ఆయన మంత్రి లోకేశ్ లేదా మంత్రి ఫరుఖ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

News September 25, 2024

విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో పలువురు కూటమి నేతలు స్వాగతం పలికారు. ఆయన రోడ్డు మార్గాన నగరంలో ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. ఐటీకి సంబంధించిన సదస్సులో పాల్గొనున్నారు. అలాగే పలువురు కూటమి నాయకులను కూడా కలుస్తారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళతారు.

News September 25, 2024

విశాఖ: హెల్త్ వర్కర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు ప్రభుత్వ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

News September 25, 2024

‘ఎనలేని సేవలు అందిస్తున్న విశాఖ ఐఎండీ’

image

విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎన్నలేని సేవలు అందిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఏయూలో నిర్వహించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. సాంకేతిక సహాయాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.

News September 25, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఆటల పోటీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో ఈనెల 26 నుంచి నిర్వహించే స్కూల్స్, జూనియర్ కళాశాలల క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దేముడు బాబు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఏయూ గ్రౌండ్‌లోను, రెజ్లింగ్ పోటీలు అల్లూరి జిల్లా కొయ్యూరులో జరుగుతాయన్నారు. 27న ఆనందపురంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథిలిన్ పోటీలు నిర్వహిస్తామన్నారు.

News September 25, 2024

వరద బాధితుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ విరాళం

image

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌ డి.గౌర్‌ విష్ణు తేజ్‌‌లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.

News September 24, 2024

మంత్రి లోకేశ్ విశాఖ పర్యటనలో మార్పులు

image

విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన ఒక్క రోజుకే పరిమితమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆర్థిక సదస్సు ముగింపు అనంతరం విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అన్ని చేశామని మంగళవారం సాయంత్రం చేరుకోవలసిన మంత్రి అనివార్య కారణాలతో రాలేదని తెలిపారు.

News September 24, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఎస్‌ఎం‌ఎస్-1లో ప్రమాదం జరగడంతో షిఫ్ట్ ఇన్ ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్‌పి బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. గాయపడిన మల్లేశ్వరరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News September 24, 2024

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు

image

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు(టీడీపీ), ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (జనసేన)తమ్మిరెడ్డి శివ‌శంకర్‌ను నియమించారు.

News September 24, 2024

సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ

image

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి తీవ్ర అపచారం చేశారని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు, యాగాలు చేశారు.