India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.
ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల పిల్లల కోసం 1984లో తమ సొంత ఆర్ధిక వనరులతో విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఉక్కు ఉద్యోగుల పిల్లలు లేరనే దురుద్దేశ్యంతో అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి వారిని రోడ్డున పడేశారు. దీంతో సిబ్బంది జూన్ 12 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యంతో మంత్రి లోకేశ్ మాట్లాడి పాఠశాల పునఃప్రారంభించాలని సిబ్బంది వేడుకుంటున్నారు.
మంత్రి నారా లోకేశ్ ఆదివారం కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రుషికొండ ఐటీ హిల్ నం.3లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మహిళల వన్డే మ్యాచ్ వీక్షించునున్నారు.
అగనంపూడిలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో మనవడే సూత్రధారి అని ఏసీపీ నర్సింహమూర్తి పోలీసులు తెలిపారు. సురేశ్ తన స్నేహితుడు సుమంత్తో కలిసి అన్నెమ్మను బెదిరించి 5తులాల బంగారు గాజులు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో సుమంత్ను అదుపులోకి తీసుకొని విచారించగా సురేశ్ సహకారంతోనే దోపిడీకి పాల్పడినట్లు చెప్పాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ వివరించారు.
విశాఖ వేదికగా జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పలు సెంటర్లలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని మేయర్ ఆదేశించారు.
➤ దువ్వాడ దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్
➤ కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కె.కె.రాజు
➤ రేపు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్
➤ పీఎంపాలెంలో వివాహిత సూసైడ్
➤ కేజీహెచ్ నుంచి ఆరుగురు విద్యార్థులు డిశ్చార్జ్
➤ యాంటీ డ్రగ్ గ్లో థిమ్ పార్క్ ప్రారంభం
➤ విశాఖలో విజయవాడ రౌడీ షీటర్ హత్య
విజయవాడ రౌడీ షీటర్ శ్రీధర్ను చంపేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. రౌడీ షీటర్ శ్రీధర్ ఎలమంచిలి కోర్టుకు రాగా ఇక్కడ ఉంటున్న రౌడీ షీటర్ గౌరీశంకర్తో కలిసి విశాఖ వచ్చాడు. వీరితో పాటు మరో ఇద్దరు మద్యం తాగి శ్యామల అనే మహిళ ఇంటిలో గొడవపడ్డారు. ఈ గొడవలో శ్రీధర్ను గౌరీ శంకర్ కత్తితో పొడిచి పోలవరం కాలువలో పడేశాడు. దర్యాప్తులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీఎంపాలెం పరిధిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. భారతికి తన భర్త చనిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి ఆమె అత్త అడ్డుచెప్పి ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో మనస్థాపం చెంది ఉరివేసుకుంది. తను చనిపోయానని ఎవరో ఒకరి సెల్ నుంచి అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పు అని తన కుమారుడిని ఉద్ధేశించి సూసైడ్ నోట్లో రాసింది.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా DMHO కార్యాలయం నుంచి శనివారం ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు ర్యాలీని ప్రారంభించారు. బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లాలో ప్రతి 1,000 మంది బాలురకు 969 మంది బాలికలు ఉన్నారని, ఈ నిష్పత్తి సమానంగా ఉండేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలన్నీ లింగ నిర్దారణ పరీక్షలు చేయకూడదన్నారు.
Sorry, no posts matched your criteria.