India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల స్థాయి విద్యాశాఖ అధికారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోనుంది.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికారులు ప్రకటించారు. గల్లా పోలిపల్లి, గొలగాని వీరరావు, నూకరత్న, పిసిని వరాహ లక్ష్మి నరసింహం, పిల్లా మంగమ్మ, బల్లా శ్రీనివాసరావు, బొమ్మిడి రమణ, పులి లక్ష్మీ బాయి, విల్లూరి భాస్కర్ రావు, శరగడం రాజశేఖర్ ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. విజేతలందరూ ఎన్డీఏ కూటమి బలపరిచిన వారే కావడం విశేషం.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి మయూర్ అశోక్ సూచించారు. బుధవారం పలువురి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఏజెన్సీలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న సీతాఫలాల అమ్మకాలు ప్రస్తుతం పాడేరు మండలంలో జోరందుకున్నాయి. మన్యం అమృత ఫలాలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో పాడేరు ఘాట్లోని వంట్లమామిడి కేంద్రంగా సీతాఫలాల అమ్మకాలు సాగుతున్నాయి. రెండు బుట్టలను కావిడ రూ. 1000 నుంచి రూ.1500 వరకు రేటు పలుకుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ప్లాంట్కు చెందిన అత్యంత విలువైన ఆస్తులు, మానవ వనరులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలు భవిష్యత్తులో జాతీయ ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయని అన్నారు.
విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తుందని ఆరోపించారు. గత వైసీపీ ఎన్నికలలో టీడీపీ కేవలం 50 ఓట్లు మెజార్టీ ఉండడంతో వైసీపీ పోటీ చేయలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు వైసీపీ 400 ఓట్ల మెజార్టీ ఉందన్నారు.
కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఈ నెల 29న ప్రైవేట్ ఐటిఐల్లో మిగులు సీట్ల భర్తీకి మూడవ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 26లోగా ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ప్రింట్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని కోరారు.
నక్కపల్లి హైవేపై ఒక ట్రయిలర్ లారీపై వెళ్తున్న విమానాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్య పోయారు. కోల్కతా నుంచి చెన్నైకు పొడవటి ట్రయిలర్ లారీపై పాత విమానాన్ని తీసుకువెళ్తుండగా, హైవేపై ప్రయాణించేవారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. వినియోగంలో లేని ఈ పాత విమానానికి మరిన్ని హంగులు దిద్ది, ఒక హోటల్గా తయారు చేస్తారని ఇందులో సంబంధిత వ్యక్తి చెప్పారు. కోల్ కతా ఎయిర్పోర్ట్ నుంచి దీనిని తీసుకొస్తున్నారు.
విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రైలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతుండగా మేలుకొని కేకలు వేసింది. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నిందితుడిని పట్టుకుని బుధవారం ఉదయం విశాఖలో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు.
చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుజ-ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్లో హాల్ట్ కల్పించామన్నారు.
Sorry, no posts matched your criteria.