Visakhapatnam

News March 6, 2026

మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.

News March 5, 2026

విశాఖ విచ్చేసిన మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మధ్యాహ్నం విశాఖ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావడానికి లోకేశ్ వచ్చారు.

News March 5, 2026

ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

News March 5, 2026

విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

image

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.

News March 4, 2026

రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

image

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.

News March 4, 2026

విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం

image

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ చోరీలను అరికట్టాలని, ఆర్‌డీఎస్‌ఎస్ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

News March 4, 2026

భూగర్భ విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయండి: విశాఖ ఎంపీ

image

విశాఖలో జరుగుతున్న భూగర్భ విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీ శ్రీ భరత్ విద్యుత్ అధికారులకు సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో‌ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 11 మండలాల్లో విద్యుత్ సరఫరా పనితీరు, సోలార్ విద్యుత్ వినియోగం, భూగర్భ పనులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్యాంబాబు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News March 4, 2026

విశాఖ: రైలు ప్రయాణికులకు అలెర్ట్

image

వాల్తేర్ డివిజన్‌లోని శిలిమ్లిగూడ-కరకవలస మధ్య డబుల్ లైన్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ మధ్య నడిచే (58501, 58502) ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

image

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.