Visakhapatnam

News August 5, 2024

విశాఖ: బాలుడిపై పోక్సో కేసు

image

విశాఖ జిల్లాలోని ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీకి చెందిన ఓ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో ఆమె కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతి అని తేలింది. దీనికి కారణమైన అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై బాలిక తల్లి ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరావు తెలిపారు.

News August 5, 2024

రిటర్నింగ్ అధికారిగా విశాఖ జేసీ

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జేసీ కె.మయూరి అశోక్ వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఛాంబర్‌లోనే నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 13 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న ఎన్నిక జరుగుతుంది. సహాయ రిటర్నింగ్ అధికారులుగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల డీఆర్ఓలు ఉంటారు.

News August 5, 2024

సీఎం సదస్సుకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు దూరం

image

అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించే కలెక్టర్ల సదస్సుకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు హాజరు కావడం లేదు. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అనుమతి కోసం విశాఖ కలెక్టర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సదస్సులో అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ ఉంటుంది. ఆయా అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఈసీ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

News August 5, 2024

అల్లూరి జిల్లాలో గుండెలు పిండేసిన ఘటన

image

కొడుకు మృతదేహం పట్టుకుని నడిరోడ్డుపై తల్లిదండ్రులు రోదించిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెంకొత్తవిధి మండలం తిరుమలబంధకి చెందిన కార్తీక్‌కి గుండె నొప్పి రావడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించుకొని తిరిగి ఆదివారం తల్లిదండ్రులు తమ చుట్టాల ఇంటికి తీసుకు వెళుతుండగా అరకు సమీపంలో ఆ బాలుడు మృతి చెందాడు. రోడ్డుపైనే మృతదేహంతో సుమారు మూడు గంటల పాటు రోదిస్తూ ఉండిపోయారు.

News August 5, 2024

నేడు లే అవుట్లు పరిశీలించనున్న విశాఖ కలెక్టర్

image

ఆనందపురం మండలంలోని పలు గ్రామాలలో విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్రప్రసాద్ సోమవారం పర్యటించనున్నారని ఎంపీడీవో అప్పలనాయుడు తెలిపారు. చందక, గొట్టిపల్లి, లొడగలవానిపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన కాలనీ లే అవుట్లను పరిశీలిస్తారని వివరించారు. కాలనీలో మౌలిక సౌకర్యాలను పరిశీలించి, లబ్దిదారులను కలిసి పలు విషయాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.

News August 4, 2024

విశాఖ: ఇది కదా ఫ్రెండ్‌షిప్ అంటే..!

image

ఓ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగిస్తున్నారు. ఏటా స్నేహితుల దినోత్సవాన కలుస్తూ ఉంటారు. అయితే వారిలో కే.కోటపాడు మండలం పాచిలవానిపాలెంకి చెందిన అప్పారావుకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. దీంతో ఈ ఏడాది మిగిలిన స్నేహితులు రూ.50 వేలు పోగు చేసి ‘ఫ్రెండ్‌షిప్ డే’న అందజేశారు. సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ ఆదుకున్నవారే స్నేహితులని నిరూపించారు. మరి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా..?

News August 4, 2024

విశాఖ: మీసేవా ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఏర్పాటు

image

ఉమ్మడి విశాఖ జిల్లా మీసేవా ఆపరేటర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది. అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా కొరుప్రోలు చంద్రశేఖర్, కార్యదర్శిగా నాగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా అప్పలనాయుడు, ఉపాధ్యక్షులుగా నాగరాజు, తులసి రామ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ.. మీసేవా కేంద్రాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.

News August 4, 2024

విశాఖ రేంజ్‌లో 35 మంది సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో వీరిని మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సీఐలు తక్షణమే విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

News August 4, 2024

అనకాపల్లి జిల్లాలో 991 కేసులు నమోదు: ఎస్పీ దీపిక

image

అనకాపల్లి జిల్లాలో శనివారం ఎంవీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 568, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై 38, అక్రమ మద్యంపై 7 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ దీపిక ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారిపై 86, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై 292, రోలుగుంట మండలం చటర్జీపురంలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఒక కేసును నమోదు చేశామన్నారు.

News August 4, 2024

బొర్రాగుహల పరిరక్షణకు చర్యలు: ఎంపీ తనూజారాణి

image

అనంతగిరి మండలంలో సహజసిద్ధ బొర్రాగుహల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా.తనుజారాణి తెలిపారు. ఈ విషయమై లోక్ సభలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో బొర్రాగుహలకు వచ్చే నష్టాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సహజసిద్ధ గుహలను పరిరక్షించడం, కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అరకు ఎంపీగా వీటిని కాపాడాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని చెప్పారు.