Visakhapatnam

News April 15, 2025

విశాఖ: అమ్మతోనే నేను..!

image

మధురవాడ సమీపంలో కీచక భర్త చేతిలో హత్యకు గురైన నిండు గర్భిణి <<16097534>>అనూష<<>> మృతదేహానికి వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమెకు నెలలు నిండటంతో గర్భంలోనే ఆడ శిశువు మృతి చెందింది. మృతి చెందిన పసికూనను వైద్యులు బయటకు తీశారు. ‘నవమాసాలు మోసిన మీ అమ్మతోనే నువ్వు వెళ్లిపోతున్నావా’ అంటూ కుటుంబ సభ్యులు విలపించారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటనపై పెద్దఎత్తున మండిపడుతున్నారు. 

News April 15, 2025

విశాఖ జడ్పీ సమావేశానికి హాజరు కావాలి: ఛైర్పర్సన్

image

విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జడ్పీ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జిల్లా అభివృద్ధి ఎజెండాపై కీలక చర్చలు జరగనున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, ఆహ్వానితులు హాజరు కావాల్సిందిగా జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మంగళవారం కోరారు.

News April 15, 2025

మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

News April 15, 2025

మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 15, 2025

విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

image

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.

News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

News April 15, 2025

సింహాచలం చందనోత్సంపై సమీక్షించనున్న మంత్రి 

image

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

News April 15, 2025

దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

image

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్‌కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్‌కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.

News April 14, 2025

ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని: హీరో నాని

image

పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని’ అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్- 3’ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం థియేటర్లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని మరిన్ని విషయాలు పంచుకున్నారు.

News April 14, 2025

విశాఖ: ప్రేమ వివాహం.. భార్యను హత్య చేసిన భర్త

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో అనుమానం పెరిగి భార్యను హత్య చేశాడు. అడ్డరోడ్డుకు చెందిన అనూష, దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మధురవాడలో నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధం ఉన్నదని ఇద్దరి మధ్య గొడవ అయింది. దీంతో భర్త ఎనిమిది నెలల గర్భిణీ గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందింది. మృతురాలిని కెజిహెచ్ హాస్పిటల్‌కి తరలించారు.