Visakhapatnam

News February 26, 2026

విశాఖకు రూ.32,373 కోట్ల రుణ లక్ష్యం

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు నాబర్డు రూ.32,373 కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని సూచించారు.

News February 25, 2026

ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

image

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

News February 25, 2026

రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

image

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.

News February 25, 2026

విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

image

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.

News February 25, 2026

విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

image

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.

News February 25, 2026

కంబాలకొడం అభివృద్ధి కి బృహత్ ప్రణాళిక

image

కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు. పర్యావరణహితంగా పర్యాటక కార్యకలాపాలు రూపకల్పన చేయాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.

News February 25, 2026

విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 25, 2026

విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 25, 2026

విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 25, 2026

విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.