India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.
➤ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు
➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు
➤ రుషికొండ బ్లూ ఫ్లాగ్ ఇష్యూ పై జేసీ సమీక్ష
➤ వాట్సాప్లో పదో తరగతి హాల్ టికెట్లు
➤ ఈ నెల 6న ఒకే వేదికపై దగ్గుపాటి పురంధేశ్వరి, చంద్రబాబు
➤ ఈ నెల 4వ తేదీ నుంచి అసంఘటిత కార్మికులు ధర్నా
➤ ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసుల నాయుడు 710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రోజు నుంచి ముగ్గురు మధ్య పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రతి రౌండ్లో శ్రీనివాసులు నాయుడు కొంతమేరకు ఆదిక్యం కనపరుస్తూనే వచ్చారు. చివరకు ఎలిమినేషన్ రౌండ్-2 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు గెలుపొందినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.
సీఎం చంద్రబాబు ఈనెల 6న విశాఖ రానున్నారు. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొంటారు. సుదీర్ఘకాలం తర్వాత తోడల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించనున్నారు.
పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 9552300009 నంబర్కు హాయ్ అని పంపిస్తే దాని ద్వారా వాట్సాప్ సేవలు > విద్యా సేవలు > SSC హాల్ టికెట్ > అప్లికేషన్ నంబర్ > చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ > స్ట్రీమ్ > కన్ఫర్మ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
విశాఖలో ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షల నిర్వహణను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం తనిఖీ చేశారు. విశాఖ ఉమెన్స్ జూనియర్ కాలేజీ, ఎసెంట్ జూనియర్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించారు. మొత్తం 38,879 మంది విద్యార్థులకు 38,478 మంది హాజరు కాగా 401 మంది గైర్హాజరయ్యారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.
రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి MLA గంటా శ్రీనివాసురావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన IT, టూరిజంని అభివృద్ధి చేయాలని కోరారు. ఒకసారి బ్యాడ్ రిమార్క్ వస్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ నాలుగైదు రోజుల్లో బ్లూఫ్లాగ్ కమిటీ వస్తుందని ఆ టైంకి పునరుద్ధరించాలన్నారు. రద్దుకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి ఈనెల 13వ తేది వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంట ముందు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.
జీవీఎంసీ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూటమి కసరస్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 18కి జీవీఎంసీ మేయర్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Sorry, no posts matched your criteria.