India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్చి 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ సిబ్బంది శనివారం తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారు ఉత్సవ విగ్రహాలను కొండమీద నుంచి మెట్లు మార్గంలో ఊరేగింపుగా కొండ కింద ఉన్న ఉద్యానవనానికి తీసుకురానున్నట్లు తెలిపారు. మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం నిర్వహించి తిరువీధి ఊరేగింపు చేయనున్నట్లు తెలిపారు. ఆరోజున ఉండే కళ్యాణం రద్దు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు శనివారం విశాఖ జిల్లాలో 95% మంది హాజరయ్యారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సుధీర్ తెలిపారు. జనరల్ పరీక్షలకు 41,945 మందికి 40,000 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి 1,635 మంది హాజరయ్యారు. అన్ని కోర్సులకు సంబంధించి 43,686 మందికి 41,634 మంది విద్యార్థులు హాజరు కాగా 2,052 గైర్హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
విశాఖ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్ప్రెస్లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది
ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం -2 పథకం అమల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని,సబ్సిడీ నగదు వెనువెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
KGHలో ఓ నకిలీ డాక్టర్ బాధితుని వద్ద రూ.లక్ష కాజేసిన ఘటన వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన దూసి రామ్జీ కొంతకాలంగా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. వీరు కిడ్నీ అవసరమని పేపర్లో ప్రకటన ఇవ్వగా ఓ వ్యక్తి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్ష కాజేశాడు. మోసపోయాయని గ్రహించిన రాంజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విశాఖ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే నాన్ -ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ను (17239/40) మార్చి 1,2,3 తేదీలలో, విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్(22701/02) మార్చ్ 2న, విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)మార్చ్ 2న, తిరుగు ప్రయాణంలో మార్చి 3న రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు గమనించాలన్నారు.
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.