Visakhapatnam

News February 27, 2025

హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

image

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

News February 27, 2025

విశాఖలో 300 ప్రత్యేక బస్సు సర్వీసులు

image

విశాఖలో శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని 300 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపామని జిల్లా ప్రజారవాణాధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నడిపామని వెల్లడించారు. నగర నలుమూలల నుంచి వివిధ బీచ్‌లు, శైవక్షేత్రాలకు ఈ బస్సులు ఏర్పాటు చేశారు. జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. 

News February 27, 2025

పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే: వాసుపల్లి 

image

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. పోసాని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్, లోకేశ్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయన్నారు. పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే అని ఆరోపించారు.

News February 27, 2025

విశాఖ జూలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు

image

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

News February 27, 2025

విశాఖ పోలీసుల పర్యవేక్షణలో పుణ్యస్నానాలు

image

శివరాత్రి జాగరణ అనంతరం విశాఖ నగరవాసులు గురువారం సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. వీరి కోసం అటు అధికారులు ఇటు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. అలాగే జన సందోహంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించారు.

News February 27, 2025

విశాఖలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

image

విశాఖలో గురువారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగాయి. జిల్లాలోని 13 కేంద్రాల్లో 87.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News February 27, 2025

విశాఖ మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు

image

విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 27, 2025

KGHలో శిశువుల మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ

image

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.

News February 27, 2025

తల్లి మందలించిందని బాలుడి సూసైడ్

image

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News February 27, 2025

విశాఖ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న బ్రహ్మానందం

image

విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ హైందవ ధర్మంను కాపాడుకోవడాన్ని తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.