Visakhapatnam

News January 29, 2025

విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ 

image

విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ రమణకుమారి నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు రిలీజ్ చేశారు. పేడాడ రమణకుమారి వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా, బిఆర్ అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలో వైసీపీ మహిళల అధ్యక్షురాలిగా పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు.

News January 29, 2025

విశాఖ: ‘మాంసం అమ్మితే దుకాణం సీజ్’

image

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జంతు వధ నిషేధం కారణంగా గురువారం మాంసం విక్రయాలు నిషేధం పక్కాగా అమలు చేయాలని GVMC ప్రధాన వైద్యాధికారి ఎం.నరేశ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతి శానిటరీ ఇన్‌స్పెక్టర్ వార్డు సచివాలయాల కార్యదర్శులు, ఇతర అధికారులతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మాంసం విక్రయాలు జరిగితే జరిమానా విధించడంతో పాటు దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

News January 29, 2025

మహా కుంభమేళాకు విశాఖ నుంచి RTC సర్వీసులు

image

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4,8,12 తేదీలలో విశాఖ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. ప్రయాగ రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా 7 రోజుల ప్రణాళికను రూపొందించారు. పూర్తి వివరాలకు www.apsrtconline.in వెబ్‌సైట్, బస్సు స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌లో సంప్రదించాలన్నారు.

News January 29, 2025

సింహాచలం: చిరకాల సమస్యకు ఫుల్ స్టాప్..!

image

చిరకాలంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం బుధవారం ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం చంద్రబాబు విశాఖ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచ గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 12వేల మందికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పంచగ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్ 

News January 29, 2025

స్టీల్ ఉద్యోగులు, కార్మికులతో చర్చిస్తాం: శ్రీనివాస వర్మ

image

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో భేటీ కానున్నట్లు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో స్టీల్ ప్లాంట్‌ను గురువారం సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, నచ్చజెప్పి ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు.

News January 29, 2025

విశాఖ తీరంలో విషపూరిత పాము 

image

విశాఖ పరిధిలోని సాగర్ నగర్ బీచ్‌లో మత్స్యకారుల వలకు బుధవారం ఉదయం 9:30కి ఓ విషపూరిత పాము చిక్కింది. ‘హైడ్రో ఫికస్ సీ స్నేక్’ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ పాము చిన్న చేపలు, రెయ్యిలను, నాచును తింటుంది. ఈ పాము విషపూరితమైనదని కాటేస్తే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని మత్స్యకారులు తెలిపారు. పర్యాటలకులు ఈ పామును చూసి ఫొటోలు తీసిన అనంతరం.. మత్స్యకారులు పామును సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.

News January 29, 2025

విశాఖ జిల్లాకు రిపోర్టర్లు కావలెను

image

విశాఖ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ<> https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి. మేం మిమ్మల్ని సంప్రదిస్తాం.

News January 29, 2025

విశాఖ: ఆసక్తి గలవారు అప్లే చేసుకోండి..! 

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ సహాయకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తుతో పాటు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో జనవరి 31 లోపు అందజేయాలన్నారు. ఎటువంటి జీతం ఉండదని తెలిపారు.

News January 29, 2025

పంచగ్రామాల సమస్యపై కీలక నిర్ణయం

image

సింహచలం పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. కోర్టు కేసుల విత్ డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించడంతో వివాదం ముగిసిందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసు తెలిపారు. ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు ధర్మకర్తలు కూడా అంగీకరించడంతో సింహాచలంలో సమావేశం ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

News January 29, 2025

విశాఖ: చిట్టీల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

image

విశాఖ టూటౌన్ పోలీసులు చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రవీణ్ కుమార్ గతంలో విశాఖ పోలీస్ కమిషనర్ ఎదురుగా జ్యూస్ షాప్ నిర్వహించేవాడు. ఆ సమయంలో పోలీసులతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం కానిస్టేబుల్స్, స్థానికుల నుంచి చిట్టీలు కట్టించుకునేవాడు. రెండేళ్ల క్రితం రూ.80 లక్షలతో పరారీ కాగా బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.