India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

విశాఖలో ఈనెల మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖ పరిధిలో 280 మద్యం దుకాణాల ద్వారా 1,52,000 లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 81000 బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కంటే ఐదు శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.

భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం వైభవంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామిని మెట్ల మార్గం గుండా కొండ దిగువ గల వరాహ పుష్కరణి వద్దకు తీసుకొస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.