Visakhapatnam

News January 10, 2026

ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదు: డీటీసీ

image

విశాఖలో ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో డీటీసీ ఆర్సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. దూర ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయొద్దని.. బస్సుల్లో హెల్ప్ లైన్ నంబర్ 9281607001 స్పష్టంగా పెట్టాలన్నారు.

News January 9, 2026

విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (1/2)

image

విశాఖ మెట్రో ప్రాజెక్టు మరోసారి <<18813242>>జాప్యం<<>> దిశగా సాగుతోంది. తాజాగా కేంద్రం ఫీజబులిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరడంతో ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPRపై కేంద్రం కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, నిర్వహణ వ్యయం, బ్రేక్‌ ఈవెన్ కాలంపై స్పష్టత కోరింది.

News January 9, 2026

విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (2/2)

image

సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన విశాఖ మెట్రో ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్రం చెరో 20% భరించాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా నిధుల సమీకరణపై సందేహాలు నెలకొన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా మెట్రోతో పాటు 12 ఫ్లైఓవర్లు పూర్తైతే నగరానికి ఊరట లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే వేర్వేరు నిర్మాణాల వల్ల ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News January 9, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలపై రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 9, 2026

విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక నిఘా: మంత్రి డోలా

image

విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ‘ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలన్నారు.

News January 9, 2026

విశాఖలో ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ స్పష్టత

image

విశాఖ జిల్లాలో రబీ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) తెలిపారు. జిల్లాకు జనవరి వరకు 1096 టన్నుల యూరియా అవసరం కాగా.. 1651 టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1073 టన్నుల ఎరువులు (యూరియా 600 టన్నులు) నిల్వ ఉన్నాయని, ఇవి జనవరి చివరి వరకు రైతులకు సరిపోతాయని పేర్కొన్నారు.

News January 9, 2026

విశాఖ: బెట్టింగ్ యాప్ నిర్వహణ.. మరో ఇద్దరి అరెస్ట్

image

విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన రాంబాబు, సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన హేమ సుబ్రహ్మణ్యం మూర్తి కలిసి పలు బెట్టింగ్ యాప్‌లు నిర్వహించి మోసాలకు పాల్పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

News January 9, 2026

జిల్లా రివ్యూలో ఎమ్మెల్యే పల్లా సూచనలు

image

జిల్లా రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగం పరిధిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు పరిశీలించాలన్నారు.

News January 9, 2026

విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

image

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 9, 2026

విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.