India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.
విశాఖ నగర పోలీస్ కమిషనర్గా నియమితులైన అదనపు డీజీ శంకబ్రత బాగ్చి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశాఖలో పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుత కమిషనర్ రవిశంకర్ నుంచి సీపీగా శంకబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరిస్తారు.
మారిటైం భాగస్వామ్య విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన క్షీపణి విధ్వంసకర యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్ బంగ్లాదేశ్కు చేరుకుందని విశాఖలో తూర్పు నౌక దళం అధికారులు తెలిపారు. గత నెల 29న చిట్టిగాంగ్కు చేరుకున్న నౌకకు ఆదేశ నౌకాదళ బృందం సాదర స్వాగతం పలికింది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బేగం భారత్ సందర్శన అనంతరం రణవీర్ నౌక బంగ్లాదేశ్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్లు ఆదివారం రాత్రి విశాఖ వైయస్సార్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన కోస్టల్ రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాయలసీమ కింగ్స్ జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి విజయం సాధించింది.
అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో పాఠశాలలకు భవనాలు లేక గిరిజనులు సొంతంగా మట్టి గోడలతో తాత్కాలిక గుడిసెను నిర్మించుకుంటున్నారు. అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ పరిధి తంగిలబంధ గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సొంతంగా మట్టి గోడలతో తాత్కాలిక గుడిసె నిర్మించుకుంటున్నామని తంగిలబంధ గిరిజనులు తెలిపారు.
పర్యాటకులతో విశాఖ బీచ్లు ఆదివారం కిటకిటలాడాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులతో పాటు నగరవాసులు బీచ్లోని ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు. పిల్లలతో పాటు బీచ్కు చేరుకుని స్నానం చేస్తూ గడిపారు. దీంతో ఆర్కే బీచ్తో పాటు పరివాహక ప్రాంతమంతా చిన్నారులు, యువతీ యువకులతో కిక్కిరిసిపోయింది. పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.
విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3 పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణు కుమార్ రాజు, ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
చింతపల్లి మండలంలోని కొత్తబంద గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలోని బడి ఈడు పిల్లలు పక్క గ్రామమైన పొట్టిబంద ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడం, రెండు గ్రామాల మధ్యలో కొండవాగు ఉండడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి వాగుపై కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.
మత్స్యకార సొసైటీలకు గతంలో వలే కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరయ్య, ప్రధాన కార్యదర్శి పిక్కి.కొండలరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ మత్స్యకార ఎన్నికల అధికారికి వినతి పత్రం అందిస్తున్నట్లు నక్కపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మత్స్యకారులు మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.