Visakhapatnam

News March 3, 2025

నేడే ఓట్ల లెక్కింపు.. ఏయూలో ఆంక్షలు..! 

image

టీచర్స్ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు AUలో ఈరోజు ఉ.8 గంటలకు ప్రారంభం కానుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఏయూ పరిసర ప్రాంతాలలో ఉ.6 నుంచి కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుంపుగా తిరుగుట నిషేధమన్నారు. మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు మద్యం షాపులు బంద్ కాగా.. గెలిచిన అభ్యర్థులకు విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేదన్నారు.

News March 3, 2025

విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.

News March 3, 2025

VSKP.. మధురానగర్‌లో బంగారం చోరీ

image

విశాఖలోని మధురానగర్ రాధవ్ మాధవ్ టవర్స్‌లో దొంగలు పడ్డారు. ఇంటి యజమానికి కృష్ణ కాకినాడలో బంధువులు ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని ఎదురిటివారు కృష్ణకు ఆదివారం ఫోన్ చేశారు. దీంతో వెంటనే బంధువులతో కలిసి వచ్చి చూడగా ఇంట్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 2, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ ఏయూతో కలిసి పనిచేయడానికి ఐడీసీ సిద్ధం
➤ విశాఖ రేంజ్‌లో ఎస్ఐలుగా బావ, బామ్మర్ది
➤ ఏయూ శతాబ్ది ఉత్సవాలలో ప్రతీ ఒక్కరూ కీలక భూమిక పోషించాలి: వీసీ
➤ బడి రుణం తీర్చుకుంటున్న గాజువాక పూర్వ విద్యార్థులు
➤ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
➤ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్

News March 2, 2025

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్ల నంబర్లు మార్పు

image

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లకు నంబర్లు మార్చడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. మార్చ్ 7 నుంచి భువనేశ్వర్ – రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌కు(20849/50), మార్చ్ 4 నుంచి భువనేశ్వర్-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్‌కు(20851/52), మార్చ్ 6 నుంచి భువనేశ్వర్ – చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్‌కు(20853/54) గా సవరించారన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 2, 2025

విశాఖ రేంజ్‌లో ఎస్ఐలుగా బావ బామ్మర్ది..!

image

విశాఖ రేంజ్‌లో బావ బామ్మర్దులు ఎస్‌లుగా రిపోర్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం పి.పొన్నవోలుకి చెందిన పులఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్ఐలుగా ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన వీరు వరుసకు బావమరుదులు అవుతారు. అనంతపురంలో 52 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న వీరిద్దరూ ఆదివారం విశాఖ రేంజ్‌లో రిపోర్ట్ చేశారు. ఇద్దరూ ఒకేసారి ఎంపికవ్వడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 2, 2025

ఏయూతో కలిసి పని చేయడానికి ఐడీఎస్ సిద్ధం: గాలబ్

image

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల బృందం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గాలబ్ ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రసంగాలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాన్ని బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశోధన, బోధనా రంగాల్లో తాము సేవలందిస్తామన్నారు.

News March 2, 2025

బైక్ రేసర్ల ఆటకట్టించిన విశాఖ పోలీసులు

image

విశాఖలో బైక్ రేసర్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. ప్రశాంతంగా ఉండే సాగరతీరంలో రాత్రి పగలు తేడా లేకుండా బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దీంతో నగరవాసులతోపాటు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఎంవీపీ త్రీ టౌన్ పరిధిలో అప్పుఘర్, ఆర్కే, నావెల్ ఏరియా, సాగర్ నగర్ బీచ్ ప్రాంతాల్లో పోలీసులు నిఘాపెట్టి 50 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 

News March 2, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు

image

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు అయ్యింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా మారడంతో ఎస్ఈకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గుర్తింపు రద్దు చేసి జెండాలను కిందకి దించేశారు. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్‌గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ న్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్(ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికెట్ అందించింది.

News March 2, 2025

విశాఖ: పరీక్షలకు హాజరవుతున్న జువైనల్ హోమ్ విద్యార్థులు

image

చిన్నగదిలి తహశీల్దార్ కార్యాలయం వెనుక గల ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక విద్యార్థిని శనివారం మొదటి సంవత్సరం పరీక్ష రాసింది. రెండో సంవత్సరం పరీక్షలకు మరో విద్యార్థిని సిద్ధమవుతోంది. కాగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు 8 మంది సిద్ధమవుతున్నారని హోమ్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు.