Visakhapatnam

News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

News June 30, 2024

విశాఖ: అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.3.2 కోట్లు

image

టీడీపీ హయాంలో విశాఖ నగరంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. వాటి పునరుద్ధరణకు రూ.3.2 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఇంజినీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆరేళ్ల క్రితం నగరంలో 25 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.40 లక్షలు వెచ్చించింది.

News June 30, 2024

విశాఖ: రిమ్ పెక్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ శివాలిక్

image

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విన్యాసం రిమ్ ఆఫ్ ది పసిఫిక్(రిమ్ పెక్)లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ శివాలిక్ హవాయిలోని పెరల్ హార్బర్‌కు చేరుకుంది. ఇండియా-జపాన్ మధ్య దైపాక్షిక వ్యాయామం జిమెక్స్-2024 పూర్తయిన తర్వాత ఐఎన్ఎస్ శివాలిక్ పెరల్ హార్బర్‌కు చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఈనెల 27న ప్రారంభమైన విన్యాసాలు జాలై 7 వరకు కొనసాగుతాయని విశాఖలో నేవీ అధికారులు తెలిపారు.

News June 30, 2024

దంతెవాడ-కిరండోల్ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తి

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోని కెకె లైన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సువోమోయ్ మిత్ర భద్రతా పరమైన తనిఖీలను శనివారం నిర్వహించారు. దంతేవాడ-కములూర్ సెక్షన్‌లో డబ్లింగ్ పనులు పరిశీలించారు. మోటార్ ట్రాలీపై వెళ్లి పట్టాలు, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. వేగానికి సంబంధించి ట్రైల్ రన్ నిర్వహించారు. దంతెవాడ-కిరండోల్ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయినట్లు తెలిపారు.

News June 30, 2024

అరకు ఎమ్మెల్యేగా విజయం.. జడ్పీటీసీకి రాజీనామా

image

హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శనివారం విశాఖపట్నం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్ ‌కు అందజేసినట్లు మీడియాకు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుకుంపేట జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.

News June 29, 2024

పాడేరు: ఎన్నికల ఖర్చును రెండు రోజుల్లో సమర్పించాలి

image

సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చులను సంబంధిత రికార్డులలో నమోదు చేసి నియోజకవర్గం వ్యయ పరిశీలకులతో రికన్సిలేషన్ చేసి సమర్పించాలన్నారు. వాటిని ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామన్నారు.

News June 29, 2024

విశాఖ: ఏపీఎల్-3 ట్రోఫీ ఆవిష్కరణ

image

విశాఖ వైయస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 30 నుంచి ఏపీఎల్-3 సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శనివారం ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్టేడియంలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నట్లు స్టేడియంలో మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు తెలిపారు. జూలై 13 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయన్నారు.

News June 29, 2024

పాడేరు: ప్రతి 2 గంటలకు పంపిణీ శాతాన్ని పర్యవేక్షించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకే తలుపు తట్టి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఆదేశించారు. శనివారం పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి 2 గంటలకు పింఛన్ల పంపిణీ శాతాన్ని పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

News June 29, 2024

స్పీకర్ పదవికి గౌరవం పెరిగేలా పనిచేస్తా: అయ్యన్న

image

స్పీకర్ పదవికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి బాధ్యతలను అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు.

News June 29, 2024

విశాఖ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, అనకాపల్లి కలెక్టర్ రవి సుభాశ్, డీఐజీ విశాల్ గున్ని పలువురు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పీకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్ అధికారులతో చర్చించారు.