Visakhapatnam

News March 1, 2025

విశాఖలో TODAY TOP NEWS

image

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది

News February 28, 2025

బాధ్యతలు స్వీకరించనున్న ఏయూ వీసీ

image

ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 

News February 28, 2025

మరింత అప్రమత్తంగా ఉంటాం: విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం -2 పథకం అమల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని,సబ్సిడీ నగదు వెనువెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 

News February 28, 2025

కేజీహెచ్‌లో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!

image

KGHలో ఓ నకిలీ డాక్టర్ బాధితుని వద్ద రూ.లక్ష కాజేసిన ఘటన వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన దూసి రామ్‌జీ కొంతకాలంగా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కేజీ‌హెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వీరు కిడ్నీ అవసరమని పేపర్లో ప్రకటన ఇవ్వగా ఓ వ్యక్తి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్ష కాజేశాడు. మోసపోయాయని గ్రహించిన రాంజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విశాఖ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 28, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు

image

రైల్వే నాన్ -ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్‌ను (17239/40) మార్చి 1,2,3 తేదీలలో, విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) మార్చ్ 2న, విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)మార్చ్ 2న, తిరుగు ప్రయాణంలో మార్చి 3న రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు గమనించాలన్నారు.

News February 28, 2025

వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.

News February 28, 2025

‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

image

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.

News February 28, 2025

ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలి: విశాఖ కలెక్టర్

image

జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, అగనంపూడిలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం గుర్తించాలన్నారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఆదేశించారు.

News February 28, 2025

విశాఖ: సెల్ఫీకి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా..!

image

వన్యప్రాణుల హావభావాలను మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. మానవ నేస్తాలుగా వన్యప్రాణులు వ్యవహరిస్తూ విశాఖ జూపార్క్‌లో ఒక సాంబార్ డీర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కళాశాల విద్యార్థులు,సందర్శకులు దీనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడానికి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా ఆ సాంబార్ డీర్ సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో జూలో సాక్షాత్కరిస్తాయి.

News February 28, 2025

విశాఖ-గుణుపూర్ పాసెంజర్‌కు అదనపు బోగి

image

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్‌కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.