Visakhapatnam

News June 28, 2024

ఏయూకు పూర్వ వైభవం తీసుకువస్తాం: గంటా

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఫోటోను వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేయకపోవడంపై గంటా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పనితీరు పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూను భ్రష్టుపట్టించినట్లు విమర్శించారు.

News June 28, 2024

అంతర్జాతీయ స్థాయిలో హిందీకి గుర్తింపు: యార్లగడ్డ

image

అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్ ఛైర్మన్, పద్మవిభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఏయూ హిందీ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ హిందీ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని కోరారు.

News June 28, 2024

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

News June 28, 2024

విశాఖ: రేపు జాతీయ లోక్ అదాలత్.. జిల్లా న్యాయమూర్తి

image

విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా న్యాయమూర్తి ఎ.గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, సివిల్, బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 28, 2024

విశాఖ: వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్టు

image

వరకట్న వేధింపులతో వివాహిత మృతికి కారకులైన ముగ్గురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లికి చెందిన ఎం. పద్మిని (32) కి గాజువాకకు చెందిన సోమేశ్‌తో వివాహం అయ్యింది. అదనపు కట్నం కోసం భర్త సోమేశ్, అత్త అప్పలనర్స, మరిది శివ కలిసి తమ కుమార్తెను వేధించి పురుగుమందు తాగించి చంపేశారని పద్మిని తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

News June 28, 2024

పాడేరు: లొంగిపోయిన మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

News June 27, 2024

హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీ చించివేత

image

ఎస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామంలో హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి అనిత హాజరవ్వగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాతబ్బాయి గ్రామ సచివాలయం వద్ద ఫ్లె‌క్సీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫొటోను చించేయడంతో తాతబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News June 27, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 27, 2024

పాడేరు: లొంగిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

News June 27, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖపట్నంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను స్పెషల్ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి విధించారు. 2021 సంవత్సరంలో ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల ⁠బాలికపై పక్కింటి వ్యక్తి అప్పన్న అఘాయిత్యం చేశాడు. నిందితుడికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ.. బాలికకు రూ.3లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.