India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దివీస్లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.

పార్వతీపురం-సీతానగరం మధ్య ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ (53587/88), విశాఖ-రాయపూర్(55827/28), విశాఖ-కోరాపుట్ వీక్లీ ఎక్స్ ప్రెస్(18511/12 ) రైళ్లు ఈనెల 22 నుంచి మే 5 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందిస్తున్న పద్మ పురస్కారాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గ్యాలియట్ మంగళవారం తెలిపారు. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలకై అంతర్జాతీయ క్రీడలలో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకువాలన్నారు. దరఖాస్తులు www.padmaawards.gov.in వెబ్ సైట్లో చూడాలన్నారు.sportsinap@gmail.com కు మే 26లోపు మెయిల్ చేయాలన్నారు.

స్టీల్ ప్లాంట్ కార్మికులు 16వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐటీయూ ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలన్నారు. 18న గాజువాకలో, 19న నగరంలో కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శనల్లో పాల్గొంటామన్నారు. సీఐటీయూ నాయకులు కుమార్, ఎఐటియుసి మన్మధరావు పాల్గొన్నారు.

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు వలన పలు రైలు గమ్యాన్ని కుదించడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుంది.

విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం విశాఖలో పర్యటిస్తారు. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో ఉదయం 11గంటలకు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొనున్నారు. వీటికి తగ్గట్టు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మధురవాడ సమీపంలో కీచక భర్త చేతిలో హత్యకు గురైన నిండు గర్భిణి <<16097534>>అనూష<<>> మృతదేహానికి వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమెకు నెలలు నిండటంతో గర్భంలోనే ఆడ శిశువు మృతి చెందింది. మృతి చెందిన పసికూనను వైద్యులు బయటకు తీశారు. ‘నవమాసాలు మోసిన మీ అమ్మతోనే నువ్వు వెళ్లిపోతున్నావా’ అంటూ కుటుంబ సభ్యులు విలపించారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటనపై పెద్దఎత్తున మండిపడుతున్నారు.

విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జిల్లా అభివృద్ధి ఎజెండాపై కీలక చర్చలు జరగనున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, ఆహ్వానితులు హాజరు కావాల్సిందిగా జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మంగళవారం కోరారు.

మల్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.