India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని, పాత అర్జీదారులు రసీదులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం ‘1100’ కాల్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భవిష్యత్తంతా పోరాట కాలమని, ఐక్య ఉద్యమాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని, ప్రధాని మోదీ జమానాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని విశాఖలో సీఐటీయూ బహిరంగసభలో కార్మిక నేతలు అన్నారు. రాబోయే కాలమంతా పోరాటాలేనని, అందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న సమ్మెతో చరిత్ర సృష్టించాలన్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖ సిటీ పోలీస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు జనవరి 5న ఉదయం 10 గంటల నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని సీపీ స్పష్టం చేశారు.

గాజువాకలోని ఓ లాడ్జిలో మోహన్ రాజు అనే వ్యక్తి శనివారం రాత్రి <<18758829>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఉదయం ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘షేర్ మార్కెట్ నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చెప్పినా వినకొండ పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అశ్విని నీకేమీ చేయలేకపోయాను తల్లి. ఎవరినీ సహాయం అడగాలనిపించలేదు’ అంటూ 7 పేజీల నోట్ రాసి ఉంది.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.