Visakhapatnam

News June 27, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా.. మూహూర్తం ఫిక్స్

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News June 27, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక శాఖ నోటీసులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తనను ఆర్థిక నష్టానికి గురి చేసిందని కార్మికుడు ఎస్.రామారావు కేంద్ర కార్మిక ఉపాధి శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్మిక శాఖ ప్రాంతీయ కమిషనర్ ఉక్కు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 5న రికార్డులతో కార్యాలయంలో హాజరుకావాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

News June 27, 2024

జగన్ ప్రతిపక్ష హోదా కోరడం అర్థరహితం: పల్లా శ్రీనివాస్

image

రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరడం అర్థరహితమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. శాసనసభలో పదవ వంతు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందన్నారు. దీనిపై లేనిపోని రాద్ధాంతాలు సృష్టించడం సరికాదన్నారు.

News June 27, 2024

విశాఖ: వివేక్ ఎక్స్‌ప్రెస్ సేవలు పొడిగింపు

image

ప్రయాణికుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని డిబ్రూఘర్-కన్యాకుమారి-డిబ్రూఘర్ 22504/22503 వివేక్ ఎక్స్ ప్రెస్‌ను ప్రతిరోజూ నడపనున్నట్లు వాల్తేర్ డీసీఎం కే. సందీప్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ రైలు వారానికి ఐదు రోజులు నడిచేది. జులై 8 నుంచి డిబ్రూఘర్- కన్యాకుమారి (22504), జులై 12 నుంచి కన్యాకుమారి – డిబ్రూఘర్ (22503) ప్రతిరోజు నడవనున్నాయి.

News June 27, 2024

రుషికొండ వెంకన్న సేవలో భక్తులు పాల్గొనే అవకాశం

image

టీటీడీకి చెందిన రుషికొండ వద్దగల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జులై 1వ తేదీ నుంచి శ్రీవారి సేవలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవకు రూ.100, పుష్పాలంకరణకు రూ.12,000 (నలుగురు కుటుంబ సభ్యులు) తోమాలసేవకు ఒక్కొక్కరికి రూ.200, సహస్రనామార్చనకు రూ.200 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 26, 2024

ఎలమంచిలి ఎమ్మెల్యే తండ్రికి గాయాలు

image

సబ్బవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తండ్రి సుందరపు సత్యనారాయణ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎలమంచిలి నుంచి ఆనందపురం వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతనిని అపోలో ఆసుపత్రికి తరలించారు. సబ్బవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 26, 2024

అల్లూరి 9.. అనకాపల్లికి 20.. 22వ స్థానంలో విశాఖ

image

➤ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షకు అల్లూరి జిల్లాలో 1,015 మంది విద్యార్థులు హాజరవ్వగా 794 మంది పాసయ్యారు. 78.23 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 3,031 మందికి 1,648 మంది ఉత్తీర్ణత సాధించారు. 54.37 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 3,671 మందికి 1,898 మంది పాసయ్యారు. 51.70శాతం ఉత్తీర్ణతతో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

అనకాపల్లి జిల్లాలో ఫోన్ పేలి యువకుడి మృతి

image

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. పక్క పాకలో వడ్డాది భవాని శంకర్ (21) ఫోన్ చూస్తుండగా అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పిడుగు పడిన సమయంలో మృతిని పక్కనే తల్లిదండ్రులు ఉన్నారు. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

News June 26, 2024

సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపు

image

సింహగిరిపై వెలసిన శ్రీ సింహాద్రి అప్పన్న ఆలయ హుండీ లెక్కింపు బుధవారం చేపట్టారు. 28 రోజులు గాను అప్పన్నకు ఉండి ద్వారా రూ.2,50,52,507/- ఆదాయం లభించింది. సగటు ఆదాయం 1 రోజుకు రూ:8,94,732/- లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకల రూపములో వెండి, బంగారంతో పాటు విదేశీ కరెన్సీ కూడా హుండీలో వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు.

News June 26, 2024

మీ సేవల నిర్వాహకులకు న్యాయం చేస్తాం: పల్లా

image

గత ప్రభుత్వం మీ సేవలను నిర్వీర్యం చేసిందని మీసేవా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మీ సేవ నిర్వాహకులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు.