Visakhapatnam

News June 26, 2024

విశాఖ:పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

వాల్తేర్ డివిజన్ పరిధిలో నౌపడ ప్రధాన లైన్ లో వంతెన ఆధునికరణ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలాస-విశాఖ-పలాస పాసెంజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27న రద్దు చేసినట్లు తెలిపారు. విశాఖ-కోరాపుట్ పాసింజర్ రైలు 26న, కోరాపుట్-విశాఖ పాసింజర్ రైలు 27న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News June 26, 2024

అల్లూరి ఒకటి.. విశాఖకి 13.. 24వ స్థానంలో అనకాపల్లి

image

➤ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలకు అల్లూరి జిల్లాలో 2,655 మంది విద్యార్థులకు 1,766 మంది పాసయ్యారు. 67 శాతంతో రాష్ట్రంలో ఒకటో స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 7,984 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,407 మంది పాసయ్యారు. 43 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,411 మందికి 1,504 మంది ఉత్తీర్ణత సాధించారు. 34 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 24వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

సింహాచలంలో వెంకటేశ్ సినిమా స్క్రిప్ట్‌‌కి పూజలు

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని తెలుగు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం..'(వర్కింగ్ టైటిల్) సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించిన పూజలు చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు.

News June 26, 2024

అండర్-16 క్రికెట్‌లో విశాఖ ఘన విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిర్వహిస్తున్న అండర్-16 బాలుల అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో విశాఖపట్నం జట్టు 433 పరుగుల భారీ తేడాతో ప.గో. జట్టుపై విజయం సాధించింది. ప.గో. 89 పరుగులకే ఆలౌట్ అయింది. 6 వికెట్లు తీసి విశాఖ బౌలర్ కె.గౌతమ్ ఆర్య పశ్చిమగోదావరి జట్టు పతనాన్ని శాసించాడు. 2వ ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

News June 26, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 టీచర్ పోస్టులు ఖాళీలు

image

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 551, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 583 పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్‌లో లాంగ్వేజ్-1 పోస్టులు 44, లాంగ్వేజ్ -2లో 43, ఇంగ్లీష్ 59, గణితం 66, ఫిజికల్ సైన్స్ 74, బయాలజీ 62, సోషల్ స్టడీస్ 99, హిందీ 139 ఖాళీలు ఉన్నాయి.

News June 26, 2024

ఏయూ: ఫుడ్ సైన్స్ టెక్నాలజీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MSC ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కోర్స్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. వీటితో పాటు MSC కెమిస్ట్రీ & అనాలసిస్ ఆఫ్ ఫుడ్ డ్రగ్ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను, MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు, MSC ఎనలిటికల్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News June 26, 2024

పరవాడ: ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు

image

పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో ఓ దళిత మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. భర్త చనిపోయిన యశోదతో కె.రమేశ్ సహజీవనం చేస్తున్నాడు. ఇది రమేశ్ తండ్రి సత్యనారాయణకు ఇష్టం లేదు. ఈనెల 23న చెక్ పోస్ట్ వద్ద యశోదతో రమేశ్ మాట్లాడుతుండగా అతని తండ్రి, చెల్లి యశోదపై కత్తితో దాడి చేశారు.

News June 26, 2024

విపరీతంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలు

image

నగరంలో కాయగూరలు ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్‌లో రెండు మూడు రకాలు మినహా దాదాపు అన్నీ కిలో రూ.40 కి చేరాయి. బహిరంగ మార్కెట్‌లో అయితే అదనంగా మరొక రూ.20 బాదుతున్నారు. దొండ రూ.28 రూపాయలు, క్యాబేజీ రూ.30, బీట్రూట్ రూ.32, క్యారెట్ రూ.38, బెండ రూ.34, వంకాయలు తెల్లవి రూ.44, నల్లవి రూ.54, టమాటా రూ.64, బరబాటి రూ.54, బీన్స్ రూ.120, అల్లం రూ.160 బంగాళదుంపలు రూ.32 ఉల్లిపాయలు రూ.36 గా ధర పలుకుతున్నాయి.

News June 26, 2024

విశాఖ-రాజమండ్రి మధ్య ఆర్టీసీ అదనపు బస్సులు

image

ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో ఆర్టీసీ మంగళవారం విశాఖ నుంచి రాజమండ్రికి 12 ప్రత్యేక సర్వీసులు నడిపింది. నిడదవోలు-కడియం స్టేషన్‌ల మధ్య రైల్వేట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేయడంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం విశాఖ- రాజమండ్రి మధ్య ప్రతి 40 నిమిషాలకు నడుస్తున్న బస్సులకు మించి డిమాండ్ ఉండడంతో 12 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బుధవారం కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

News June 26, 2024

విశాఖ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

గాజువాక కణితి రోడ్ సింహగిరి కాలనీలో గ్రామ దేవత తుంపాలమ్మ తల్లి పండుగలో మంగళవారం లైటింగ్ పెడుతున్న ఎలక్ట్రీషియన్ కోలా జోగి బాబుకి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. కరెంట్ తీగను నోటితో పట్టి లాగి తీగలను అతికించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.