Visakhapatnam

News June 25, 2024

ఈనెల 20 సింహాచలంలో గిరి ప్రదక్షిణ

image

సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షణను విజయవంతం చేయాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలన్నారు.

News June 24, 2024

విశాఖ: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ డివిజన్ లో ఆధునికరణ పనులు కారణంగా రద్దు చేసిన రైళ్లల్లో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైళ్ల రద్దుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్ రైళ్లను ఈనెల 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు రద్దీ తగ్గించేందుకు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.

News June 24, 2024

శభాష్ నితీష్ కుమార్ రెడ్డి..!

image

విశాఖ బ్యాటింగ్ డైనమెట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News June 24, 2024

ఆర్టీసీ బస్సులో నగర మేయర్.. సైకిల్‌పై కమిషనర్

image

పర్యావరణహితంగా నడుచుకోవాలని సందేశాన్ని చాటుతూ నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ సైకిల్ పై ఈరోజు విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం జీవీఎంసీ కార్యాలయంలోకి వాహనాలను అనుమతించరు. వీలైనంతవరకు ఉద్యోగులు, ప్రజలు ప్రజారవాణా వినియోగించాలని, కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణహితంగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.

News June 24, 2024

ఇ‌న్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్

image

విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కె.మయూర్ అశోక్ సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ఏ.మల్లికార్జునను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీగా విధులు నిర్వహిస్తున్న మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు.

News June 24, 2024

జIలై 27 నుంచి ఎమ్మెస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఏయూ పరిధిలోని ఎమ్మెస్సీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షలను జIలై 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా పరీక్షల తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్సైట్‌ను సంప్రదించమన్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో హోంమంత్రి అనిత

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు ఉమ్మడి విశాఖ నుంచి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాపై 100 రోజుల యాక్షన్‌ ప్లాన్ అమలు చేస్తున్న హోంమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది వేచిచూడాలి.

News June 24, 2024

విశాఖ: MA పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏయూ

image

ఏయూ పరిధిలోని MA అంత్రపోలజీ, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, కూచిపూడి క్లాసికల్ డాన్స్, హిస్టరీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, కర్ణాటక సంగీతం, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఏన్షియెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సై‌ట్‌లో అందుబాటులో ఉంచారు.

News June 24, 2024

బీపీఈడీ, డీపీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. ఏప్రిల్ నెలలో జరిగిన పార్ట్-ఎ, పార్ట్-బీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలను విడుదల చేసి విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.Andhrauniversity.edu.in నుంచి పొందవచ్చును.

News June 24, 2024

అల్లూరి జిల్లాలో వైద్య బృందం పర్యటన

image

పెదబయలు మండలం చుట్టుమెట్టలో పలు విభాగాల సైకాలజిస్ట్ వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న భూత వైద్యం చేస్తూ ఇద్దరు మృతి చెందిన ఘటనపై గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైద్య బృందం పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరూ ధైర్యంగా ఉండాలని ఆరోగ్య, నీటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.