India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం
విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం
విశాఖ స్టీల్ ప్లాంట్ యజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే మార్చి నెలాఖరులోగా సెటిల్మెంట్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న 500 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మందికి వీఆర్ఎస్ అమలు చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 15 ఏళ్ల సర్వీసు, 45 ఏళ్ల వయసు ఉండాలి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం చర్లపల్లికి (సికింద్రాబాద్) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-చర్లపల్లి స్పెషల్ రైలు ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి చర్లపల్లి చేరుకుంటుందన్నారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం మీదుగా వెళుతుందన్నారు.
హుకుంపేట మండలం పట్టం పంచాయతీ దాబువలసలో విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న భవానీ అనే గర్భిణీని పాడేరు జిల్లా ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గ్రామానికి తరలించి శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లల సంతానం.
విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశాఖలో ఆర్ఐఓ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు సెలవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 19 ఆదివారం కావడంతో తిరిగి 20 నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. ప్రైవేట్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.