Vizianagaram

News August 10, 2024

VZM: ప్రోటోకాల్.. జెండా ఎగురవేసే మంత్రులు వీరే

image

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన ప్రోటోకాల్ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15న విజయనగరం జిల్లా కేంద్రంలో జరగనున్న వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ జెండాను ఎగురవేస్తారు.

News August 9, 2024

పార్వతీపురం: ఈ నెల 11 నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

విశాఖ నుంచి నడిపే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి సింహాద్రి, రత్నాచల్, ఉదయ్, గుంటూరు-రాయగడ, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించనున్నారు. 50 రోజులుగా ఈ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిశీలించిన రైల్వే అధికారులు ఈ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

News August 9, 2024

పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు: కలెక్టర్ అంబేడ్కర్

image

జిల్లాలో ఉన్న అన్ని కర్మాగారాల్లో, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో స్థానిక ఉద్యోగాల నిబంధనల మేరకు 75% ఉండేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గత వారం జరిగిన సమావేశంలో అన్ని కంపెనీల్లో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ సురేశ్, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు కర్మాగారాల్లో తనిఖీలు నిర్వహించి శత శాతం స్థానికత ఉందని తెలిపారు.

News August 9, 2024

KGHలో లంచాలకు పాల్పడే వారిపై క్రమ శిక్షణ చర్యలు

image

కేజీహెచ్‌లో లంచాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద హెచ్చరించారు. శుక్రవారం కేజీహెచ్‌లో మాట్లాడుతూ.. ఇకపై లంచాలకు తావు లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 0891-2590100, 2590102 నంబర్‌లకు ఫిర్యాదు చేయాలన్నారు.

News August 9, 2024

గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి కొండపల్లి

image

గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. గిరిజనుల వల్లే అడవులను సంరక్షించుకోగలుగుతున్నామన్నారు.

News August 9, 2024

పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తాం: చంద్రబాబు

image

విశాఖలో MLC ఎన్నికల కారణంగా G.0 నం.3, ఉద్యోగాలపై మాట్లాడలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పార్వతీపురం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉత్సవాల వేదిన నుంచి సీతంపేట మండలానికి చెందిన సవర తులసి సీఎం చంద్రబాబుతో మాట్లాడారు.

News August 9, 2024

రాత్రిపూట విధులు నిర్వహించానడం దారుణం: వీఆర్ఏలు

image

వీఆర్ఏలకు రాత్రిపూట విధులు నిర్వహించాలని చెప్పడం దారుణమని వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.సూర్యనారాయణ అన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత ఐదు సంవత్సరాలు వీఆర్ఏల జీతాలు పెంపు, ప్రమోషన్లు విషయాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వమైన తమకు జీతాలు పెంచి, ప్రమోషన్లు కల్పించాలని కోరారు.

News August 9, 2024

VZM: కష్టమే పెట్టుబడి.. నమ్మితే ప్రాణమిస్తారు..!

image

కష్టమే వారి పెట్టుబడి.. నమ్మితే ప్రాణమిస్తారు.. మోసం చేస్తే మళ్లీ ముఖం కూడా చూడరు. కల్మషం లేని నవ్వు వారి సొంతం.. ఎవరికీ హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం. పచ్చని చెట్లను ప్రేమిస్తూ.. వన్య ప్రాణులను లాలిస్తూ.. అడవితల్లి ఒడిలో సేదదీరుతూ.. మౌళిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే వనరులు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తున్న ఉమ్మడి విజయనగరం గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.

News August 9, 2024

VZM: లేఖ రాసి లవర్ కోసం వెళ్లిపోయిన యువతి..!

image

విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యంపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ప్రేమించిన యువకుడి కోసం వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది. తన కోసం మరి వెతకొద్దంటూ ఆ లేఖలో తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ యువకుడు యువతికి ఇన్‌స్టాలో పరిచయం అవ్వగా.. అతనిది బెంగుళూరుగా పోలీసులు గుర్తించారు.

News August 9, 2024

విజయనగరంలో అంగన్వాడీలపై కేసు కొట్టివేత

image

2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలపై పెట్టిన కేసులను మొబైల్ కోర్టు తాజాగా కొట్టి వేసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని 2017 సెప్టెంబర్ నెలలో కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నేతలతో కలిసి అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని అంగన్వాడీ, సీఐటీయూ నేతలపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం కేసు సరైంది కాదని కోర్టు కొట్టివేసింది.