Vizianagaram

News August 7, 2024

అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు సకాలంలో పూర్తి చేయాలి: ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలతో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సమావేశం నిర్వహించారు. బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యే విధంగా డీఎస్పీలు పర్యవేక్షించాలని సూచించారు.

News August 7, 2024

విజయనగరంలో ముగిసిన అవగాహన సదస్సు

image

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్వహించిన మూడు రోజుల అవగాహన సదస్సు బుధవారంతో ముగిశాయి. పరిశ్రమల స్థాపనకు రాయతీ రుణాలు ఎలా పొందాలో జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వంశీ మోహన్ అవగాహన కల్పించారు. లోన్లు ఎలా పొందాలో కెనరా బ్యాంకు ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు పాల్గొన్నారు.

News August 7, 2024

రామభద్రపురం యువకునికి 20 ఏళ్ల జైలుశిక్ష

image

పోక్సో కేసులో నిందితునిగా ఉన్న భవిరెడ్డి రవితేజకు 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.6,000/- జరిమానా విధించినట్లు రామభద్రపురం ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. రొంపల్లి గ్రామంలో 2021 అక్టోబర్ నెలలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రవితేజ నిందితునిగా ఉన్నాడన్నారు. నేరం రుజువు కావడంతో యువకుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు.

News August 7, 2024

గనులు, మైనింగ్ ద్వారా VZM జిల్లా ఆదాయం ఎంతంటే

image

జిల్లాలో గనులు, మైనింగ్ ద్వారా 2023-24 ఏడాదికి రూ. 125 కోట్ల ఆదాయం జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని మరింత పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.135 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఇటీవల జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబుకు వివరించారు.

News August 7, 2024

విజయనగరంలో ఈ నెల 9న జాబ్ మేళా

image

పట్టణంలోని స్థానిక మహారాజా కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి అరుణ తెలిపారు. సంగీత మొబైల్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, రిలయన్స్ జియో ఫైబర్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ తదితర సంస్థల్లో కొలువుల భర్తీకి ఎంపికలుంటాయని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని.. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 7, 2024

VZM: అగమ్య గోచరంగా గృహ నిర్మాణాలు

image

ఏపీలో రెండవ అతిపెద్ద జగనన్న లేఅవుట్ విజయనగరం గుంకలాం లే అవుట్. సాక్షాత్తు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ లేఔట్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇక్కడ ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణా బిల్లులు విడుదల అవుతాయో, లేదోనన్న సందిగ్ధత నెలకొంది.

News August 7, 2024

VZM: బొకారో ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

image

చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుళ-ధన్‌బా‌ద్ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29 తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్‌కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్‌లో హాల్ట్ కల్పించామన్నారు.

News August 7, 2024

విశాఖలో ఆర్మీ ర్యాలీ.. ఏర్పాట్లపై సమీక్ష

image

విశాఖ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై ఆర్మీ, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన 8వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

News August 7, 2024

ఆదివాసి దినోత్సవం జరిగే ప్రదేశాన్ని పరిశీలించిన కలెక్టర్

image

గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రదేశాన్ని, ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం పరిశీలించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉన్నందున మండలంలో అనువైన పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ వెంట జేసీ శోభిక తదితర సిబ్బంది ఉన్నారు.

News August 6, 2024

ఏయూ: ఆన్‌లైన్ క్విజ్.. ప్రైజ్‌మనీ రూ.40వేలు

image

ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్‌లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.