India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినొత్సవం సందర్భంగా సోమవారం అల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. మాత్రల్ని గుర్ల మినహా అన్ని మండలాలకు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈనెల 10న విజయనగరంలో జరగాల్సిన కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి బి.శ్రీ నాథుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లాటరీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతులు వచ్చిన వెంటనే లాటరీ తేదీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.
మత్తు, మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా, పండించినా చట్టరీత్యా తీవ్ర నేరంగానే పరిగణిస్తామన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. యువతను అప్రమత్తం చేసేందుకు సంకల్ప రథం ద్వారా కృషి చేస్తున్నామని మంచి జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.
అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు పొందారు.
Sorry, no posts matched your criteria.