Vizianagaram

News July 25, 2024

VZM: జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సందేశం

image

ఫెడెక్స్, బ్లూడాట్ కొరియర్స్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా కాల్స్, లింక్స్, వీడియోకాల్స్‌తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

News July 25, 2024

అశోక్ గజపతిరాజుపై ఎన్ని కేసులంటే..

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. దీంట్లో మొత్తం 54 మంది ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వీరిలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా ఉంది. ఈయన పై రెండు కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు.

News July 25, 2024

ఏయూ: ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామని తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఆ తేదిల్లో ఎలాంటి మార్పు చేయలేదని సూచించారు.

News July 25, 2024

VZM: రెల్లిలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం..!

image

కొత్తవలస మండలంలోని రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్న దొరపాలెంలో వర్సిటీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దత్తిరాజేరు మండలంలోని కుంటినవలసుకు మార్పు చేసింది.

News July 25, 2024

VZM: ‘అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు’

image

కుక్కకరిస్తే వేసే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అన్ని పీహెచ్సీలలో ఉన్నా.. పిచ్చికుక్కలు కరిస్తే వేయాల్సిన హ్యూమన్ రేబిస్ వ్యాక్సిన్ కేజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్యులను 8,339 మంది సంప్రదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో 70 వేలకు పైగానే కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

News July 25, 2024

తోటపల్లి ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితి

image

తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 105 మీటర్లు కాగా.. 104.10 మీటర్ల వరకు నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి 2,139 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. రెండు కాల్వల ద్వారా 210 క్యూసెక్కుల సాగునీటిని పంట పొలాలకు అందిస్తున్నామని తెలిపారు.

News July 25, 2024

VZM: ‘మరమ్మతులకు రూ.కోటి నిధులు’

image

జిల్లాలోని ఐదు అన్న క్యాంటీన్ల మరమ్మతులకు రూ.కోటి నిధులు కేటాయించినట్లు ప్రజారోగ్యశాఖ ఈఈ దక్షిణామూర్తి తెలిపారు. బొబ్బిలిలోని భవనాన్ని బుధవారం పరిశీలించి మాట్లాడారు. బొబ్బిలి, రాజాం, నెల్లిమర్లతో పాటు జిల్లా కేంద్రంలో మూడు క్యాంటీన్లు ఉన్నట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి జిల్లా కేంద్రంలో రెండు, బొబ్బిలిలో క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటి పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

News July 25, 2024

మాజీ కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా మంత్రులు

image

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బుధవారం అమరావతిలో కలసి పలు సమస్యలు, ఇతర అంశాలు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చెయ్యాలని అశోక గజపతి రాజు మంత్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి పాల్గొన్నారు.

News July 25, 2024

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి: పార్వతీపురం కలెక్టర్

image

ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరిశీలించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కాకుండా శత శాతం చర్యలు చేపట్టాలన్నారు.

News July 24, 2024

కొరియా పారిశ్రామికవేత్తలతో మంత్రి కొండపల్లి భేటీ

image

కొరియా దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వాళ్లకి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.