Vizianagaram

News March 13, 2025

VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

image

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.

News March 13, 2025

విజయనగరం జిల్లాలో హైవేపై 64 సీసీ కెమెరాలు: కలెక్టర్ 

image

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు 64 సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్క‌ర్ చెప్పారు. తన ఛాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 34కి.మీ. రోడ్డుపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాల అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చూడాలన్నారు.

News March 13, 2025

ఈనెల 15న విజయనగరంలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It

News March 13, 2025

VZM: కేంద్ర మంత్రితో ఎంపీ కలిశెట్టి భేటీ

image

ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.

News March 13, 2025

పది పరీక్షలు రాసేవారికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం

image

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2024- 25 విద్యా సంవత్సరంలో మార్చి- 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం హాజరుకానున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు.

News March 12, 2025

VZM: ‘పీపీ మోడల్‌లో పర్యటకాభివృద్ధికి ముందుకు రావాలి’

image

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్  కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

News March 12, 2025

VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.

News March 12, 2025

VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అద‌న‌పు స‌హాయం

image

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న -గ్రామీణ్‌, అర్బ‌న్, పీఎం జ‌న్‌మ‌న్‌ ప‌థ‌కాల కింద గ‌తంలో మంజూరై నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ వెల్ల‌డించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని అందిస్తుందన్నారు.

News March 12, 2025

VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

image

సారా ర‌హిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో నాటుసారా నిర్మూల‌న స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని బుధ‌వారం నిర్వ‌హించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబ‌రు 14405 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సూచించారు.

News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.