India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏ.ఆర్.దామోదర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దామోదర్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వకుల్ జిందాల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు.
విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్గా, సీడీఏ కమిషనర్గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్కర్కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికను ఆరికతోట జడ్పీ హైస్కూల్లో చేపట్టారు. ఇందులో 50 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా జూడో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నకిశోర్ తెలిపారు. అండర్14, 17, 19 జిల్లా జూడో టీం ఎంపిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 25 మంది బాలికలు, 25 మంది బాలురు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వెళ్లనున్నట్లు చెప్పారు.
విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
తెర్లాం PSలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కంకణాల కిరణ్కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. తెర్లాంకు చెందిన బాలిక నడుచుకుంటూ వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కిరణ్ ఆమెను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయగా పారిపోయాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు SP తెలిపారు.
విజయనగరం జిల్లాలో సర్వికల్ కేన్సర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 2 వారాల పాటు నిర్వహించబోతున్నామని DMHO జీవనరాణి గురువారం తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ కేంద్రాల్లో స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.
విజయనగరం మండలం రాకొడు గ్రామానికి చెందిన పి.రామారావు (35) ప్రమాదవశాత్తు నేలబావిలో పడి గురువారం మృతి చెందాడు. పశువుల మేతకు గడ్డి కోసం వెళ్లి నేలబావిలో జారి పడినట్లు మృతుని భార్య సంధ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్మెంట్ అండ్ కమిషనర్ (సీఏడీఏ) నుంచి బదిలీపై వస్తున్నారు.
విజయనగరం జిల్లా వైద్యారోగ్య శాఖ సమన్వయ సమావేశాన్ని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది. DMHO జీవన రాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆగస్టు నెలలో సంభవించిన 3 శిశు మరణాలపై సమీక్షించారు. భవిష్యత్తులో శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని DMHO సూచించారు. గర్భస్థ దశలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, గర్భిణీలలో రక్తహీనత నివారణకు ఐరన్ టాబ్లెట్లు అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.