Vizianagaram

News September 10, 2025

రాజాంలో రేపు జాబ్ మేళా

image

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News September 10, 2025

ఢిల్లీ చేరిన జిందాల్ భూ నిర్వాసితులు

image

ఎస్.కోట మండలం బొడ్డవరలో 80 రోజులుగా నిరసన తెలిపిన జిందాల్ భూ నిర్వాసితులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు బుధవారం చేరుకున్నట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వం గిరిజన సమస్యలపై స్పందించకపోవడంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు గిరిజనుల సమస్యలను తెలియపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News September 9, 2025

VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

image

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.

News September 9, 2025

మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత ప్రచారం: VZM ఎస్పీ

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం ప్రచార రథం ద్వారా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. క్షేత్ర స్ధాయిలో ‘సంకల్ప రథం’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతతో పాటు డ్రగ్స్‌ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 9, 2025

ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News September 9, 2025

విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.

News September 9, 2025

VZM: మరో ఇద్దరు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు

image

కూటమి ప్రభుత్వం నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి 51 మంది డైరెక్టర్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. విజయనగరం నియోజకవర్గం నుంచి కెల్ల అప్పలనాయుడు(టీడీపీ), గజపతినగరం నుంచి బండారు సాయి లక్ష్మి (టీడీపీ)కి అవకాశం ఇచ్చింది.

News September 9, 2025

VZM: జిల్లాలో 5వేల ఎకరాల్లో IT పార్కుల ఏర్పాటు

image

IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.

News September 9, 2025

సుజల స్రవంతి భూ సేకరణను వేగవంతం చేయండి: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని 4 గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖరారు చేయాలన్నారు.

News September 8, 2025

తాలాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో బింగి లక్ష్మణరావు (30) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ గోపాల్‌రావు సోమవారం తెలిపారు. అతనికి పెళ్లై 2 సంవత్సరాలైందన్నారు. మృతుడి భార్య గౌతమి (గంగమ్మ) ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.