Vizianagaram

News June 26, 2024

12వ స్థానంలో పార్వతీపురం.. విజయనగరం@18

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 72.27 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. 440 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 318 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 2,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,711 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.26 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

విశాఖ టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగ అవకాశాలు

image

విశాఖలో టెక్ మహీంద్రాలో 328 ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 29న విశాఖ‌ప‌ట్నంలోని డా. విఎస్ కృష్ణా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా జ‌రుగుతుంద‌న్నారు. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 28లోగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్లకి ప్రాధాన్యత.

News June 26, 2024

విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?

image

విజయనగరం జిల్లాలో పురుషుల కంటే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో బాలికల నిష్పత్తి ఎందుకు త‌గ్గుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై అధ్య‌య‌నం చేసి, వారం రోజుల్లో త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని విద్యాశాఖ‌ను ఆదేశించారు. విద్య‌, అనుబంధ‌ సంక్షేమ వసతిగృహాలపై తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు.

News June 26, 2024

సాలూరు ప్రజలకు రైలు సౌకర్యం ఎప్పుడు?

image

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

News June 26, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 26, 2024

మూడో స్థానంలో పార్వతీపురం.. 8వ స్థానంలో విజయనగరం

image

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 53 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. 1,679 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 884 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 5,673 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,502 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

నకిలీ యప్‌ల ద్వారా రూ. 67 లక్షలు స్వాహా: బొబ్బిలి సీఐ

image

నకిలీ షేర్ మార్కెట్ యాప్‌ల ద్వారా రూ.67 లక్షలు నష్ట పోయారని బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్, లోన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక మొత్తాలకు ఆశపడితే మోసపోవడం తప్ప.. చేయగలిగిందేమి లేదన్నారు.

News June 26, 2024

జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు: మంత్రి సంధ్యారాణి

image

ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ ‌కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.

News June 26, 2024

పూసపాటిరేగ మండలంలో విషాదం

image

పూసపాటిరేగ మండలంలో విషాదం అలముకుంది. గోవిందపురానికి చెందిన శ్రీను జూనియర్ లైన్‌మెన్ వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఘటనలో వెల్దూరికి చెందిన అర్జున్ రెడ్డి(38) మద్యానికి బానిస అవ్వడంతో కడుపునొప్పితో బాధపడేవాడు. రెండురోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో వెతకగా.. మంగళవారం ఓ తోటలో పురుగుమందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు.

News June 26, 2024

VZM: మనస్తాపంతో వ్యక్తి మృతి

image

భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన కర్రోతు నారాయన (40) మద్యానికి బానిసయ్యాడు. భార్య ఎల్లమ్మ, మిగతా కుంటంబసభ్యులు తాగొద్దని పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ ఈనెల 21న పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటింబీకులు విజయనగంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.