India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంట్యాడ పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. గంట్యాడ మండలం తాడిపూడికి చెందిన పదాల సత్యనారాయణ భార్యతో గొడవలు కారణంగా మామ అప్పలస్వామిని కత్తితో పొడిచి చంపడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష ఖరారైందని చెప్పారు.
ఎస్.సి, ఎస్.టి అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని తెలిపారు. వారి రక్షణకు రూపొందించిన చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 321 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. తొలి రోజు 279 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ తెలిపారు. కాగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంతయుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనానిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 31 రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. రాత్రి 1 గంట దాటిన తర్వాత రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విజయనగరం పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్న ఎంపికలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్నింగ్, లాంగ్ జంప్, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన వారికి త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కోరారు.
పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో సరదా కోసం తల్లిదండ్రులతో పొలానికి వెళ్లారు. సరదా కోసం నూర్పిడి యంత్రం ఎక్కితే ఆ యంత్రం బోల్తా పడి బాలుడు ప్రాణాలను తీసింది. బొబ్బిలి మండలం గున్నతోటవలసకు చెందిన మణికంఠ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నూర్పిడి యంత్రం ఎక్కవద్దని ట్రాక్టర్ యజమాని, తల్లిదండ్రులు చెప్పిన సరదా కోసం ఎక్కి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హాల్ చల్ చేసిన నకిలీ IPS సూర్య ప్రకాశ్ను పోలీసులు బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. ఇటీవల మన్యంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఐపీఎస్ యూనిఫామ్తో సూర్యప్రకాశ్ హడావుడి చేయడం చర్చనీయాంశమైంది. నిందితుడిని పోలీసులు సాలూరు కోర్టులో హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు.
బొబ్బిలి మండలంలోని మహారాణితోట సమీపంలో ఉన్న పొలంలో నూర్పిడి యంత్రం బోల్తాపడి సాలపు మణికంఠ(14) మృతి చెందారు. బాలుడు తల్లిదండ్రులు శంకర్, పొలమ్మ నూర్పిడి కూలీ పనికి వెళ్లగా తల్లిదండ్రులతో ఇద్దరు కుమారులు వెళ్లారు. నూర్పిడి అయిపోవడంతో యంత్రంపైకి ఎక్కవద్దని తల్లిదండ్రులు చెప్పినప్పటికి వినకుండా మణికంఠ, తమ్ముడు పార్థు, మరో అబ్బాయి ఎక్కారు. బోల్తా పడడంతో ఇద్దరు దూరంగా తుల్లగా మణికంఠ కిందపడి మరణించాడు.
జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు PMT, PET పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని రకాలైన ఏర్పాట్లును పూర్తి చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాలో 9,152 మంది అభ్యర్థులకు రేపటి నుంచి జనవరి 22 వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీసీ కెమోరాల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.
ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు ఉమ్మడి విజయనగరం జిల్లా మీదుగా రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి-బనారస్-తిరుపతి (కుంభమేళా), నరసాపూర్-బనారస్-నరసాపూర్ (కుంభమేళా) స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
Sorry, no posts matched your criteria.