India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మంగళవారం హిందీ పరీక్షలకు మొత్తం 23890 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. వారిలో 443 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎటువంటి చూసి రాతలు గానీ, మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం హిందీ పరీక్ష సజావుగా జరిగిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. ఏడుగురు ముద్దాయిలను గుర్తించామని తెలిపారు. బొబ్బిలికి చెందిన నారయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని వెల్లడించారు.
విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించే చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్సవానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ రోజున కేవలం విధుల్లో ఉన్న వైదికలు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండే వాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆరోజున ఘాట్ రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని అన్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఏడేళ్ల జైలు, రూ.3,500 జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పు ఇచ్చిందని విజయనగరం SP దీపిక ఎం.పాటిల్ తెలిపారు. జామి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఆబోతుల సత్తిబాబు (45) మైనర్పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక తల్లి 20 సెప్టెంబర్ 2023న పిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్ట్ నిందుతుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని SP తెలిపారు.
చదువుకి వయసుతో సంబంధం లేదని గుమ్మలక్ష్మిపురం మండలానికి చెందిన పెద్దమ్మి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి సోమవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపింది. సోమవారం పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు.
వేపాడ(M) <<12875448>>కుంపల్లి<<>>కి చెందిన డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్ తొలగిస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కుని మృతుడి భార్య హేమలతకు అందజేశారు.
విజయనగరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసినట్లు ఎస్.ఐ హరిబాబు నాయుడు వెల్లడించారు. రిలయన్స్ మాల్కి ఎదురుగా ఉన్న తుప్పల్లో ఉరి వేసుకుని మరణించినట్లు వీఆర్వో సమాచారం అందించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
కొత్తవలస రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఔట్ పోస్ట్ పరిధి కంటకాపల్లి నిమ్మలపాలెం మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెళ్తున్న రైలు నుంచి జారీ పడి మరణించాడని ఆర్ఫీఫ్ పోలీసులు భావిస్తున్నారు. విజయనగరం జీఆర్పీ పోలీసులకు తెలిపామని అధికారి ఎఎస్ఐ కె. యు.ఎం. రావు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలలోగా ప్రైవేటు స్థలాల్లో వివిధ రాజకీయ నాయకుల ప్లెక్సీలు, జెండాలను తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడిఏ పిఓ విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం పాచిపెంట మండలం పి కొనవలస, పాచిపెంటలో పర్యటించారు. పి కొనవలస ఐటీడీఏ బంగ్లాలో జరుగుతున్న పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈఈ జే సంతేశ్వరరావు, డీఈ ఏ మనిరాజ్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.