Vizianagaram

News January 17, 2026

VZM: వాట్సాప్‌లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

image

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

News January 17, 2026

రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 17, 2026

VZM: పండగకి ఇంత తాగేశారా..!

image

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.

News January 16, 2026

రామభద్రపురంలో పండకొచ్చిన అల్లుడికి 101 వంటకాలతో విందు

image

రామభద్రపురం మండల కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన నూతన జంట పూసర్ల వెంకట సాయికుమార్, పద్మావతి దంపతులను అత్తవారు మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించారు. 101 రకాల వంటకాలను ఇవాళ తయారు చేసి పెద్ద అరటి ఆకులో కొత్త అల్లుడికి వడ్డించారు. ఇలా సంప్రదాయంగా వంటకాలు పెట్టిన బొడ్డు నాగ సైనకుమార్, సత్య దంపతులను పలువురు కొనియాడారు.

News January 16, 2026

గరివిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గరివిరి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండగ నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై లోకేశ్వరరావు, సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ అందజేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.