Vizianagaram

News May 25, 2024

VZM: విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తండ్రి మందలించడంతో కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సింగిరెడ్డివలసకు చెందిన విద్యార్థిని (17) విశాఖలోని మహారాణిపేట బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం మహారాణిపేట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News May 25, 2024

విశాఖలో ఎల్.కోట మహిళ మృతి

image

కుమార్తెను కాలేజీలో చేర్చడానికి తన కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా వెల్లంకి సాధుమఠం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె, కుమారుడు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గనివాడకు చెందిన సవళ్ళ నవ్య(40) తన కుమార్తె ఝాన్సీని ఇంటర్‌లో జాయిన్ చేయడానికి వెళ్తుండగా లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

News May 25, 2024

విజయనగరం: సరిగ్గా 10 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 10 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మన విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
– మీ కామెంట్..?

News May 24, 2024

VZM: 6 కేంద్రాలు.. 1470 మంది అభ్యర్థులు

image

VZM జిల్లాలో డిప్యూటీ DEO పరీక్షను 6కేంద్రాల్లో అధికారులు శనివారం నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు 1470 మంది హాజరుకానున్నారు. రాజాం GMR కళాశాలలో 300 మంది, చింతలవలసలోని MVGR- 250, భోగాపురంలోని అవంతి- 170, బొబ్బిలిలోని స్వామి వివేకానంద- 90, విజయనగరంలోని సత్య- 150, కొండకరకాం సీతం కాలేజీలో 510 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11:30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 24, 2024

VZM: 25న పరీక్ష.. 8:30 లోపు చేరుకోవాలి

image

APPSC డిప్యూటీ డీఈవో నియామక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 లోపు చేరుకోవాలని DRO అనిత తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం సమీక్షించి పలు సూచనలు చేశారు.

News May 24, 2024

విజయనగరం: తొలిరోజు పరీక్ష.. 729 మంది గైర్హాజరు: DEO

image

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు జిల్లా మొత్తంగా 1218 విద్యార్థులకు గాను 489 మంది హాజరయ్యారు. 729 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. 

News May 24, 2024

విజయనగరం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: SP

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారని SP దీపిక తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న 38 మందిపై, ఓపెన్ డ్రింకింగ్ చేసిన మరో 74మందిపై కేసులునమోదుచేశారని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు.

News May 24, 2024

విజయనగరం: తొమ్మిదేళ్ల బాలుడు మృతి

image

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) గురువారం రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు మండల SI మహేశ్ కుమార్ తెలిపారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీ ఏర్పాట్లు: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తికావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ కె.కార్తీక్ పాల్గొన్నారు.

News May 24, 2024

పార్వతీపురంలో అక్రమంగా పట్టుబడిన మద్యం ధ్వంసం

image

పార్వతీపురంలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా, మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సునీల్ షరైన్, సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 576 మద్యం బాటిల్స్‌తో పాటు, సుమారు 130 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.