WestGodavari

News September 27, 2024

ప.గో: ఉద్యోగినికి వేధింపులు.. ముగ్గురిపై కేసు

image

ప.గో జిల్లా తణుకు SCIM డిగ్రీ కాలేజ్‌లో ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడి, కులం పేరిట దూషించిన ప్రిన్సిపల్‌ పి.అనిల్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ రాజేశ్, సీనియర్ అసిస్టెంట్‌ పార్వతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్‌ తెలిపారు. అటు.. బాధితురాలి కుటుంబీకులు ప్రిన్సిపల్ ఆఫీస్‌కు వచ్చి దౌర్జన్యం చేశారని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామన్నారు.

News September 27, 2024

ఏలూరు జిల్లా వర్షపాతం వివరాలు

image

ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదవేగిలో 56.0 మి.మీ, ద్వారకాతిరుమల 49.6, కామవరపుకోట 41.2, జంగారెడ్డిగూడెం 34.8, భీమడోలు 28.6, బుట్టాయిగూడెం 26.8, పోలవరం 22.2, దెందులూరు 12.6, కొయ్యలగూడెం 12.4, పెదపాడు 10.2, ఏలూరు అర్బన్ 7.2, ఏలూరు రూరల్ 6.4 మి.మీ నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదు అయిందన్నారు.

News September 27, 2024

ప.గో జిల్లా వర్షపాతం వివరాలు

image

భీమవరం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 33.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం తెలిపారు. పాలకోడేరు 9.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. తాడేపల్లిగూడెం 5.4, యలమంచిలి 4.4, పెనుమట్ర 4.0, ఇరగవరం 3.4, పోడూరు 2.4, పెంటపాడు 1.8, ఆకివీడు- పాలకొల్లు మండలాలలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని స్పష్టం చేశారు.

News September 27, 2024

ఏలూరు జిల్లాలో రేపు వైసీపీ శ్రేణుల పూజలు

image

కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి జంతువుల కొవ్వుతో లడ్డూ తయారీ అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి వైసీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు.

News September 27, 2024

చింతలపూడి: చెరువులో శవమై తేలిన యువకుడు

image

చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన నాగరాజు (26)మంగళవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనే ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురువారం స్థానిక పశువుల కాపరులు చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులకు సమాచారం అందించడంతో మృతదాహాన్ని బయటకు తీయగా నాగరాజుగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 27, 2024

‘సాంకేతికతతో మెరుగైన ఉపాధి అవకాశాలు’

image

ప.గో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో సాంకేతికత, సౌర విద్యుత్‌ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్‌ అండ్‌ వాటర్‌, న్యూఢిల్లీ (సీఇఇడబ్ల్యూ) ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

News September 27, 2024

దెందులూరు: వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి

image

దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో గురువారం రాత్రి విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పురస్కరించుకొని విగ్రహ నిమజ్జనంలో గ్రామానికి చెందిన సింహాద్రి అయ్యప్ప(28) పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు స్థానిక చెరువులో గల్లంతయ్యాడు. వెలికి తీసిన తోటి వారు హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.

News September 27, 2024

వైసీపీని గెలిపించలేదనే పడవల కుట్ర: నిమ్మల

image

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదనే అక్కసుతో 3 బోట్లను, లింక్ చేసి వదిలి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని జగన్ కుట్ర పన్నాడని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం కొంతేరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణులకు సాముహిక సీమంతాలు చేసి, చీర, గాజులు, పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు.

News September 27, 2024

రూ.18,256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల

image

వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకర్లు కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.18,256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసినట్లు తెలిపారు.

News September 26, 2024

ప.గో: కాలువలో దూకేసిన 9Thక్లాస్ విద్యార్థిని

image

ప.గో జిల్లా తణుకు మండలం కోనాలకు చెందిన ఓ విద్యార్థిని గురువారం వెంకయ్య వయ్యేరు కాలువలో దూకింది. ముద్దాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక.. ఓ ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి కాలువ సమీపంలో దిగింది. పరుగెత్తికెళ్లి కాలువ దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సదరు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.