WestGodavari

News April 17, 2026

ప.గో: లంచావతారాలుగా మారారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు

image

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, ఆయన అనుచరుడు తోట గోపిలు లంచావతారాలుగా మారారని అదే పార్టీకి చెందిన నాయకుడు రవికిరణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గోపి కుమారుడు రాజా లంచాల దందా సాగిస్తూ, వీరి దందాను అమరావతిలో కూడా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం తగదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

News April 17, 2026

ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా భూసంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 13 విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లావ్యాప్తంగా అందిన 553 దరఖాస్తుల్లో 189 పరిష్కరించామని, మిగిలిన 229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె ఆదేశించారు.

News April 17, 2026

ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

image

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.

News April 16, 2026

రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

image

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

News April 16, 2026

రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

image

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

News April 16, 2026

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: కలెక్టర్ నాగరాణి

image

భీమవరం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ‘మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యాబోధన అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 16, 2026

ప.గో: నకిలీ సిఫారసు లేఖలతో వెలుగు చూసిన మోసం

image

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు చూపి కొందరు కేటుగాళ్లు నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అత్తిలి మండలం ఆరవల్లిలో కొందరు ఈ దందాకు తెరలేపిన వైనం వెలుగు చూసింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సిఫార్సు లేఖలు తయారు చేసి నిరుద్యోగులకు ఎరవేశారు. కేవలం అత్తిలి మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.